రాష్ట్ర సైన్స్ ఫేర్లో క్రిష్ణవేణి విద్యార్థి శరణ్ తేజ్ స్టేట్ ఫస్ట్
రాష్ట్ర సైన్స్ ఫేర్లో క్రిష్ణవేణి విద్యార్థి శరణ్ తేజ్ స్టేట్ ఫస్ట్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి
కామారెడ్డిలో గత మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్లో మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థి వి. శరణ్ తేజ్ ప్రతిభ చాటాడు. గ్రీన్ ఎనర్జీ జూనియర్ విభాగంలో చేసిన వినూత్న విజ్ఞాన ప్రదర్శనతో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు.
శరణ్ తేజ్ ప్రదర్శించిన ప్రాజెక్ట్ శాస్త్రీయ ఆలోచన, సామాజిక అవసరం కలగలిపిన విధానం న్యాయనిర్ణేతలను విశేషంగా ఆకట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన ప్రతిభావంతుల మధ్య పోటీ ఉన్నప్పటికీ శరణ్ తేజ్ ప్రథమ స్థానంలో నిలిచి క్రిష్ణవేణి విద్యాసంస్థకు, మండలానికి గర్వకారణంగా నిలిచాడు.రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించిన సందర్భంగా విద్యార్థి శరణ్ తేజ్ను, గైడ్ టీచర్ పి. మురళిని కామారెడ్డి ఎమ్మెల్యే కె. వెంకట రమణ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర స్థాయి నేతలు, అధికారులు అభినందించి బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బి. యాదగిరి, అకాడమిక్ డైరెక్టర్ జె. మణి, ఉపాధ్యాయ బృందం శరణ్ తేజ్ను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి