Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:06 AM

రాష్ట్ర సైన్స్ ఫేర్‌లో క్రిష్ణవేణి విద్యార్థి శరణ్ తేజ్ స్టేట్ ఫస్ట్

రాష్ట్ర సైన్స్ ఫేర్‌లో క్రిష్ణవేణి విద్యార్థి శరణ్ తేజ్ స్టేట్ ఫస్ట్

రాష్ట్ర సైన్స్ ఫేర్‌లో క్రిష్ణవేణి విద్యార్థి శరణ్ తేజ్ స్టేట్ ఫస్ట్
09-01-2026 119 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

కామారెడ్డిలో గత మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్‌లో మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థి వి. శరణ్ తేజ్ ప్రతిభ చాటాడు. గ్రీన్ ఎనర్జీ జూనియర్ విభాగంలో చేసిన వినూత్న విజ్ఞాన ప్రదర్శనతో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు.

శరణ్ తేజ్ ప్రదర్శించిన ప్రాజెక్ట్ శాస్త్రీయ ఆలోచన, సామాజిక అవసరం కలగలిపిన విధానం న్యాయనిర్ణేతలను విశేషంగా ఆకట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన ప్రతిభావంతుల మధ్య పోటీ ఉన్నప్పటికీ శరణ్ తేజ్ ప్రథమ స్థానంలో నిలిచి క్రిష్ణవేణి విద్యాసంస్థకు, మండలానికి గర్వకారణంగా నిలిచాడు.రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించిన సందర్భంగా విద్యార్థి శరణ్ తేజ్‌ను, గైడ్ టీచర్ పి. మురళిని కామారెడ్డి ఎమ్మెల్యే కె. వెంకట రమణ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర స్థాయి నేతలు, అధికారులు అభినందించి బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బి. యాదగిరి, అకాడమిక్ డైరెక్టర్ జె. మణి, ఉపాధ్యాయ బృందం శరణ్ తేజ్‌ను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Sthanikam

రాష్ట్ర సైన్స్ ఫేర్‌లో క్రిష్ణవేణి విద్యార్థి శరణ్ తేజ్ స్టేట్ ఫస్ట్

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

కామారెడ్డిలో గత మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్‌లో మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థి వి. శరణ్ తేజ్ ప్రతిభ చాటాడు. గ్రీన్ ఎనర్జీ జూనియర్ విభాగంలో చేసిన వినూత్న విజ్ఞాన ప్రదర్శనతో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు.

శరణ్ తేజ్ ప్రదర్శించిన ప్రాజెక్ట్ శాస్త్రీయ ఆలోచన, సామాజిక అవసరం కలగలిపిన విధానం న్యాయనిర్ణేతలను విశేషంగా ఆకట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన ప్రతిభావంతుల మధ్య పోటీ ఉన్నప్పటికీ శరణ్ తేజ్ ప్రథమ స్థానంలో నిలిచి క్రిష్ణవేణి విద్యాసంస్థకు, మండలానికి గర్వకారణంగా నిలిచాడు.రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించిన సందర్భంగా విద్యార్థి శరణ్ తేజ్‌ను, గైడ్ టీచర్ పి. మురళిని కామారెడ్డి ఎమ్మెల్యే కె. వెంకట రమణ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర స్థాయి నేతలు, అధికారులు అభినందించి బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బి. యాదగిరి, అకాడమిక్ డైరెక్టర్ జె. మణి, ఉపాధ్యాయ బృందం శరణ్ తేజ్‌ను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News