Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:56 PM

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం – టిడిపి నాయకుల ధీమా

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం – టిడిపి నాయకుల ధీమా

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం – టిడిపి నాయకుల ధీమా
January 18, 2026 01:28 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి చివెంల మండల అధ్యక్షుడు ధరావత్ వెంకన్న నాయక్, సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు గాజుల వెంకన్న, పెనపహాడ్ మండల అధ్యక్షుడు శెట్టిపల్లి సైదులు ధీమా వ్యక్తం చేశారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ పార్కు వద్ద మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీయేనని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకున్న అనేక మంది నాయకులు నేడు మంత్రులు, ముఖ్యమంత్రులుగా ఎదిగి తమ రాజకీయ జీవితాలను ఉన్నతంగా మార్చుకున్నారని గుర్తు చేశారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘన చరిత్ర ఎన్టీఆర్‌కే దక్కిందని వారు తెలిపారు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగల శక్తి, అనుభవం ఉన్న పార్టీ టిడిపియేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గోవిందా చారి, రామాచారి, నర్సింగ్ నాగయ్య, గుంటి కృష్ణ, బాణాల రాము, నకిరేకంటూ ఉపేందర్ పాల్గొని ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News