Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:51 PM

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం – టిడిపి నాయకుల ధీమా

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం – టిడిపి నాయకుల ధీమా

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం – టిడిపి నాయకుల ధీమా
January 18, 2026 01:28 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి చివెంల మండల అధ్యక్షుడు ధరావత్ వెంకన్న నాయక్, సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు గాజుల వెంకన్న, పెనపహాడ్ మండల అధ్యక్షుడు శెట్టిపల్లి సైదులు ధీమా వ్యక్తం చేశారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ పార్కు వద్ద మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీయేనని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకున్న అనేక మంది నాయకులు నేడు మంత్రులు, ముఖ్యమంత్రులుగా ఎదిగి తమ రాజకీయ జీవితాలను ఉన్నతంగా మార్చుకున్నారని గుర్తు చేశారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘన చరిత్ర ఎన్టీఆర్‌కే దక్కిందని వారు తెలిపారు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగల శక్తి, అనుభవం ఉన్న పార్టీ టిడిపియేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గోవిందా చారి, రామాచారి, నర్సింగ్ నాగయ్య, గుంటి కృష్ణ, బాణాల రాము, నకిరేకంటూ ఉపేందర్ పాల్గొని ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News