Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:25 PM

రాష్ట్రస్థాయిలో యాదాద్రి భువనగిరికి అరుదైన గౌరవం కలెక్టర్ హనుమంత రావుకు ఉత్తమ ఎన్నికల పురస్కారం

రాష్ట్రస్థాయిలో యాదాద్రి భువనగిరికి అరుదైన గౌరవం కలెక్టర్ హనుమంత రావుకు ఉత్తమ ఎన్నికల పురస్కారం

రాష్ట్రస్థాయిలో యాదాద్రి భువనగిరికి అరుదైన గౌరవం కలెక్టర్ హనుమంత రావుకు ఉత్తమ ఎన్నికల పురస్కారం
January 25, 2026 04:08 PM 155 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా మరోసారి రాష్ట్రస్థాయిలో తన సత్తా చాటింది. ఎన్నికల నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచినందుకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత రావు రాష్ట్రస్థాయి ఉత్తమ ఎన్నికల పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ ఎన్నికల విధానాల విభాగంలో యాదాద్రి భువనగిరి జిల్లాను రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా ప్రకటించారు.పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 సంవత్సరానికి గాను ఎన్నికల నిర్వహణలో ప్రతిభ చూపిన అధికారుల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్ రెడ్డి శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ హనుమంత రావు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా నిర్వహించినందుకు జిల్లాకు ఈ గుర్తింపు లభించింది. ఓటర్ల అవగాహన, పోలింగ్ శాతం పెంపు, ఎన్నికల నిర్వహణలో క్రమశిక్షణ వంటి అంశాల్లో జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని ఎన్నికల అధికారులు ప్రశంసించారు.ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంత రావు మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల అధికారులు, సిబ్బంది, క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతీ ఉద్యోగికి అభినందనలు తెలిపారు. అందరి సమిష్టి కృషి ఫలితంగానే జిల్లాకు ఈ గౌరవం దక్కిందని పేర్కొన్నారు.రాష్ట్రస్థాయిలో యాదాద్రి భువనగిరి జిల్లాకు గుర్తింపు రావడం పట్ల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News