Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:22 AM

రాష్ట్రస్థాయిలో వెల్లంకి విద్యార్థినీల జైత్రయాత్ర రగ్బీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మూడో స్థానం

రాష్ట్రస్థాయిలో వెల్లంకి విద్యార్థినీల జైత్రయాత్ర రగ్బీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మూడో స్థానం

రాష్ట్రస్థాయిలో వెల్లంకి విద్యార్థినీల జైత్రయాత్ర రగ్బీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మూడో స్థానం
January 24, 2026 10:00 PM 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
మహబూబాబాద్, జనవరి 24:

గ్రామీణ ప్రాంత విద్యార్థినీల సత్తా రాష్ట్రస్థాయిలో మరోసారి రుజువైంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పాఠశాల మైదానంలో 22, 23 తేదీల్లో నిర్వహించిన అంతర్ జిల్లా రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా పోటీల్లో వెల్లంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీలు అద్భుత ప్రతిభ కనబరిచారు.

రగ్బీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా తరపున బరిలోకి దిగిన పది మంది విద్యార్థినీలు మూడో స్థానం సాధించి జిల్లాకు గౌరవం తీసుకొచ్చారు. కఠోర సాధన, క్రమశిక్షణే ఈ విజయానికి మూలమని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.

ఈ విజయం పాఠశాలకే కాదు… గ్రామీణ విద్యార్థినీలకు ప్రేరణగా నిలిచింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీ. సురేందర్ రెడ్డి గారు, ఉపాధ్యాయులు విద్యార్థినీలను ఘనంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థినీలు:ఆర్. మహేశ్వరి, ఏ. ఆలేఖ్య, ఎన్. భార్గవి, ఎం. నాగ సుప్రియ, వి. ఉషస్వీ, ఐ. మిన్ను, ఎన్. మాన్స్రీ, జి. సహస్ర, ఎం. సహస్ర, ఆర్. నక్షత్ర.గ్రామీణ క్రీడాకారిణీల పట్టుదల, ఆత్మవిశ్వాసం రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమని పలువురు కొనియాడారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News