Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మానవత్వం చాటుకున్న కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 02:14 PM

రాష్ట్రస్థాయిలో వెల్లంకి విద్యార్థినీల జైత్రయాత్ర రగ్బీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మూడో స్థానం

రాష్ట్రస్థాయిలో వెల్లంకి విద్యార్థినీల జైత్రయాత్ర రగ్బీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మూడో స్థానం

రాష్ట్రస్థాయిలో వెల్లంకి విద్యార్థినీల జైత్రయాత్ర రగ్బీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మూడో స్థానం
24-01-2026 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మహబూబాబాద్, జనవరి 24:

గ్రామీణ ప్రాంత విద్యార్థినీల సత్తా రాష్ట్రస్థాయిలో మరోసారి రుజువైంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పాఠశాల మైదానంలో 22, 23 తేదీల్లో నిర్వహించిన అంతర్ జిల్లా రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా పోటీల్లో వెల్లంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీలు అద్భుత ప్రతిభ కనబరిచారు.

రగ్బీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా తరపున బరిలోకి దిగిన పది మంది విద్యార్థినీలు మూడో స్థానం సాధించి జిల్లాకు గౌరవం తీసుకొచ్చారు. కఠోర సాధన, క్రమశిక్షణే ఈ విజయానికి మూలమని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.

ఈ విజయం పాఠశాలకే కాదు… గ్రామీణ విద్యార్థినీలకు ప్రేరణగా నిలిచింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీ. సురేందర్ రెడ్డి గారు, ఉపాధ్యాయులు విద్యార్థినీలను ఘనంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థినీలు:ఆర్. మహేశ్వరి, ఏ. ఆలేఖ్య, ఎన్. భార్గవి, ఎం. నాగ సుప్రియ, వి. ఉషస్వీ, ఐ. మిన్ను, ఎన్. మాన్స్రీ, జి. సహస్ర, ఎం. సహస్ర, ఆర్. నక్షత్ర.గ్రామీణ క్రీడాకారిణీల పట్టుదల, ఆత్మవిశ్వాసం రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమని పలువురు కొనియాడారు.

Sthanikam

రాష్ట్రస్థాయిలో వెల్లంకి విద్యార్థినీల జైత్రయాత్ర రగ్బీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మూడో స్థానం

Article Image
మహబూబాబాద్, జనవరి 24:

గ్రామీణ ప్రాంత విద్యార్థినీల సత్తా రాష్ట్రస్థాయిలో మరోసారి రుజువైంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పాఠశాల మైదానంలో 22, 23 తేదీల్లో నిర్వహించిన అంతర్ జిల్లా రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా పోటీల్లో వెల్లంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీలు అద్భుత ప్రతిభ కనబరిచారు.

రగ్బీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా తరపున బరిలోకి దిగిన పది మంది విద్యార్థినీలు మూడో స్థానం సాధించి జిల్లాకు గౌరవం తీసుకొచ్చారు. కఠోర సాధన, క్రమశిక్షణే ఈ విజయానికి మూలమని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.

ఈ విజయం పాఠశాలకే కాదు… గ్రామీణ విద్యార్థినీలకు ప్రేరణగా నిలిచింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీ. సురేందర్ రెడ్డి గారు, ఉపాధ్యాయులు విద్యార్థినీలను ఘనంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థినీలు:ఆర్. మహేశ్వరి, ఏ. ఆలేఖ్య, ఎన్. భార్గవి, ఎం. నాగ సుప్రియ, వి. ఉషస్వీ, ఐ. మిన్ను, ఎన్. మాన్స్రీ, జి. సహస్ర, ఎం. సహస్ర, ఆర్. నక్షత్ర.గ్రామీణ క్రీడాకారిణీల పట్టుదల, ఆత్మవిశ్వాసం రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమని పలువురు కొనియాడారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News