Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:12 AM

రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి: సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత

రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి: సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత

రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి: సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత
January 07, 2026 06:56 PM 117 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రోడ్డు రవాణా భద్రత మాసోత్సవాల సందర్భంగా రామన్నపేటలో అవగాహన సదస్సు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ జి. సబిత సూచించారు. రోడ్డు రవాణా భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా ఆదేశాల మేరకు, మండల న్యాయ సేవా అధికార సంస్థ రామన్నపేట ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి. సత్తయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, కాలినడకన వెళ్లేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే మోటార్ వాహన చట్టం ప్రకారం శిక్షకు అర్హులవుతారని, 18 సంవత్సరాలు దాటినవారే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని తెలిపారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే తల్లిదండ్రులు కూడా శిక్షకు గురవుతారని హెచ్చరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గమనిస్తూ రోడ్డు దాటాలని, సిగ్నల్స్‌కు అనుగుణంగా వాహనాలు నడపాలని సూచించారు.అనంతరం రోడ్డు రవాణా భద్రత మాసోత్సవాల సందర్భంగా హాజరైన వారందరితో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు హర్షవర్ధన్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి, తహశీల్దార్ లాల్ బహుదూర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.ఏ. మసీద్, ఏజీపి సుక్క శ్రావణ్ కుమార్, సీనియర్ అడ్వకేట్ జినుకల ప్రభాకర్, ప్యానల్ అడ్వకేట్‌లు బి. డేవిడ్, మామిడి వెంకట్ రెడ్డి, ఇతర అడ్వకేట్లు, విద్యాశాఖ అధికారులు, పోలీస్, కోర్టు సిబ్బంది, లీగల్ సర్వీసెస్ టీమ్ సభ్యులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్. జగదీష్, వివిధ పాఠశాలల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News