Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:39 PM

రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి: సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత

రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి: సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత

రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి: సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత
January 07, 2026 06:56 PM 122 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రోడ్డు రవాణా భద్రత మాసోత్సవాల సందర్భంగా రామన్నపేటలో అవగాహన సదస్సు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ జి. సబిత సూచించారు. రోడ్డు రవాణా భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా ఆదేశాల మేరకు, మండల న్యాయ సేవా అధికార సంస్థ రామన్నపేట ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి. సత్తయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, కాలినడకన వెళ్లేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే మోటార్ వాహన చట్టం ప్రకారం శిక్షకు అర్హులవుతారని, 18 సంవత్సరాలు దాటినవారే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని తెలిపారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే తల్లిదండ్రులు కూడా శిక్షకు గురవుతారని హెచ్చరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గమనిస్తూ రోడ్డు దాటాలని, సిగ్నల్స్‌కు అనుగుణంగా వాహనాలు నడపాలని సూచించారు.అనంతరం రోడ్డు రవాణా భద్రత మాసోత్సవాల సందర్భంగా హాజరైన వారందరితో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు హర్షవర్ధన్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి, తహశీల్దార్ లాల్ బహుదూర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.ఏ. మసీద్, ఏజీపి సుక్క శ్రావణ్ కుమార్, సీనియర్ అడ్వకేట్ జినుకల ప్రభాకర్, ప్యానల్ అడ్వకేట్‌లు బి. డేవిడ్, మామిడి వెంకట్ రెడ్డి, ఇతర అడ్వకేట్లు, విద్యాశాఖ అధికారులు, పోలీస్, కోర్టు సిబ్బంది, లీగల్ సర్వీసెస్ టీమ్ సభ్యులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్. జగదీష్, వివిధ పాఠశాలల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News