Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:47 PM

రామన్నపేట–చౌటుప్పల్ బస్సు నిలిపివేతతో ప్రయాణికులకు తీవ్ర అవస్థలు

రామన్నపేట–చౌటుప్పల్ బస్సు నిలిపివేతతో ప్రయాణికులకు తీవ్ర అవస్థలు

రామన్నపేట–చౌటుప్పల్ బస్సు నిలిపివేతతో ప్రయాణికులకు తీవ్ర అవస్థలు
January 11, 2026 04:27 PM 163 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
బస్సు రూట్ మార్చి సేవ లు ప్రారంభించండి
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట నుంచి సిరిపురం, ఎల్లంకి మీదుగా చౌటుప్పల్ వెళ్లే ఆర్టీసీ బస్సు సేవలు మూడు నాళ్ల ముచ్చటగానే మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక కారణం చెప్పి తరచూ ఈ సెటిల్ బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు.రామన్నపేట రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యను పరిష్కరించడం స్వాగతార్హమేనని, అయితే అదే వంకతో బస్సు సేవలను పూర్తిగా నిలిపివేయడం ప్రజలకు అన్యాయమని స్థానికులు అంటున్నారు. అవసరమైతే బోగారం మీదుగా అయినా బస్సును నడిపే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పండుగ సమయాల్లో బస్సు లేకపోవడం వల్ల ప్రయాణికులు మరింత ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో రామన్నపేట నుంచి బోగారం, సిరిపురం, ఎల్లంకి మీదుగా చౌటుప్పల్‌కు బస్సు సేవలను వెంటనే పునరుద్ధరించాలని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నకు, నార్కట్‌పల్లి ఆర్టీసీ డిపో ఇన్‌చార్జ్ మేనేజర్‌కు తెలుగుదేశం పార్టీ నాయకుడు పోచబోయిన మల్లేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News