Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:37 AM

రామన్నపేట–చౌటుప్పల్ బస్సు నిలిపివేతతో ప్రయాణికులకు తీవ్ర అవస్థలు

రామన్నపేట–చౌటుప్పల్ బస్సు నిలిపివేతతో ప్రయాణికులకు తీవ్ర అవస్థలు

రామన్నపేట–చౌటుప్పల్ బస్సు నిలిపివేతతో ప్రయాణికులకు తీవ్ర అవస్థలు
January 11, 2026 04:27 PM 149 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
బస్సు రూట్ మార్చి సేవ లు ప్రారంభించండి
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట నుంచి సిరిపురం, ఎల్లంకి మీదుగా చౌటుప్పల్ వెళ్లే ఆర్టీసీ బస్సు సేవలు మూడు నాళ్ల ముచ్చటగానే మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక కారణం చెప్పి తరచూ ఈ సెటిల్ బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు.రామన్నపేట రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యను పరిష్కరించడం స్వాగతార్హమేనని, అయితే అదే వంకతో బస్సు సేవలను పూర్తిగా నిలిపివేయడం ప్రజలకు అన్యాయమని స్థానికులు అంటున్నారు. అవసరమైతే బోగారం మీదుగా అయినా బస్సును నడిపే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పండుగ సమయాల్లో బస్సు లేకపోవడం వల్ల ప్రయాణికులు మరింత ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో రామన్నపేట నుంచి బోగారం, సిరిపురం, ఎల్లంకి మీదుగా చౌటుప్పల్‌కు బస్సు సేవలను వెంటనే పునరుద్ధరించాలని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నకు, నార్కట్‌పల్లి ఆర్టీసీ డిపో ఇన్‌చార్జ్ మేనేజర్‌కు తెలుగుదేశం పార్టీ నాయకుడు పోచబోయిన మల్లేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News