రామన్నపేట మండలంలో సర్పంచ్లకు నీర్నేముల గౌడ యువజన సంఘం ఘన సన్మానం
రామన్నపేట మండలంలో సర్పంచ్లకు నీర్నేముల గౌడ యువజన సంఘం ఘన సన్మానం
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి
రామన్నపేట మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లను నీర్నేముల గౌడ యువజన సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బోగారం గ్రామ సర్పంచ్గా ఎన్నికైన కునూరు సాయి గౌడ్, లక్ష్మాపురం గ్రామ సర్పంచ్ పులి పలుపుల సునీత వీరస్వామి గౌడ్, కొత్తగూడెం గ్రామ సర్పంచ్ భద్దెం యాదమ్మ యాదగిరి గౌడ్లను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా యువజన సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి దిశగా ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నీర్నేముల కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు సుర్వి బాలరాజు గౌడ్, సుర్వి శ్రీనివాస్ గౌడ్, శివ గౌడ్, నరేష్ గౌడ్, సురేష్ గౌడ్, సతీష్ గౌడ్, గణేష్ గౌడ్, నవీన్ గౌడ్, రాకేష్ గౌడ్, మత్స్యగిరి గౌడ్, కాటం గౌడ్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి