రామన్నపేటలో రోడ్ సేఫ్టీపై అవగాహన.ఎస్ఐ నాగరాజు
రామన్నపేటలో రోడ్ సేఫ్టీపై అవగాహన.ఎస్ఐ నాగరాజు
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట పట్టణంలో రోడ్ సేఫ్టీపై ట్రావెల్స్ యజమానులు, వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రామన్నపేట సీఐ ఎన్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్ఐ నాగరాజు నిర్వహించారు.ఈ సందర్భంగా వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడాలని సూచించారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని తెలియజేశారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు.రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది వికలాంగులుగా మారడంతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటూ, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. రహదారులపై జాగ్రత్తగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ట్రావెల్స్ నిర్వాహకులు, వాహనదారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి