Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 09:05 AM

రామన్నపేటలో రోడ్ సేఫ్టీపై అవగాహన.ఎస్‌ఐ నాగరాజు

రామన్నపేటలో రోడ్ సేఫ్టీపై అవగాహన.ఎస్‌ఐ నాగరాజు

రామన్నపేటలో రోడ్ సేఫ్టీపై అవగాహన.ఎస్‌ఐ నాగరాజు
January 19, 2026 09:22 PM 273 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట పట్టణంలో రోడ్ సేఫ్టీపై ట్రావెల్స్ యజమానులు, వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రామన్నపేట సీఐ ఎన్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్‌ఐ నాగరాజు నిర్వహించారు.ఈ సందర్భంగా వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడాలని సూచించారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని తెలియజేశారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు.రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది వికలాంగులుగా మారడంతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటూ, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. రహదారులపై జాగ్రత్తగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.

ఈ అవగాహన కార్యక్రమంలో ట్రావెల్స్ నిర్వాహకులు, వాహనదారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News