Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:44 AM

రామన్నపేటలో రోడ్ సేఫ్టీపై అవగాహన.ఎస్‌ఐ నాగరాజు

రామన్నపేటలో రోడ్ సేఫ్టీపై అవగాహన.ఎస్‌ఐ నాగరాజు

రామన్నపేటలో రోడ్ సేఫ్టీపై అవగాహన.ఎస్‌ఐ నాగరాజు
January 19, 2026 09:22 PM 263 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట పట్టణంలో రోడ్ సేఫ్టీపై ట్రావెల్స్ యజమానులు, వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రామన్నపేట సీఐ ఎన్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్‌ఐ నాగరాజు నిర్వహించారు.ఈ సందర్భంగా వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడాలని సూచించారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని తెలియజేశారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు.రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది వికలాంగులుగా మారడంతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటూ, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. రహదారులపై జాగ్రత్తగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.

ఈ అవగాహన కార్యక్రమంలో ట్రావెల్స్ నిర్వాహకులు, వాహనదారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News