Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:56 AM

రామన్నపేటలో ఘనంగా మంత్రి కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు అందజేత

రామన్నపేటలో ఘనంగా మంత్రి కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు అందజేత

రామన్నపేటలో ఘనంగా మంత్రి కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు.  ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు అందజేత
May 23, 2026 05:32 PM 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలను రామన్నపేట పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

అనంతరం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు.

కార్యక్రమంలో జిల్లా డీసీసీ కార్యదర్శి కొత్తపల్లి అబ్రహం కుమార్, డీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి గుండాల నర్సింహ, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కందిమల్ల గోపాల్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ గరిక సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్టే సంతోష్, సాల్వేరు అశోక్, వనం చంద్రశేఖర్, సంగిశెట్టి సుదర్శన్, అయ్యాడపు నర్సిరెడ్డి, గోదాసు శ్రీమన్నారాయణ, బత్తుల నవీన్, కొండ శేఖర్, గోగు హరిబాబు,మల్లం మల్లేష్, ఎండీ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News