Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:03 AM

రామన్నపేటలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు

రామన్నపేటలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు

రామన్నపేటలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు
18-01-2026 314 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యుగపురుషుడు ఎన్టీఆర్‌కు ఘన నివాళులు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పేదల పెన్నిధి, బడుగు–బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను రామన్నపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామన్నపేట ఏరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి మానవీయతను చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రామన్నపేట మండల నాయకులు ఎం. ఫజల్, బత్తుల సత్తయ్య మాట్లాడారు. ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడంతోనే పేదలకు రాజకీయ స్వేచ్ఛ, ఆత్మగౌరవం లభించాయని వారు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో విస్తృత అవకాశాలు కల్పించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం ఒక చరిత్ర అయితే, పాలనా దక్షతతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల దేవుడిగా ప్రజల గుండెల్లో నిలిచారని పేర్కొన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం, మండల వ్యవస్థ ఏర్పాటు, ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు నేటికీ కొనసాగుతున్నాయంటే అది ఎన్టీఆర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు.

ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎం. ప్రజల్, బత్తుల సత్తయ్య, పోచబోయిన మల్లేశం, ఉప్పల ప్రభాకర్, ఉప్పల సత్యనారాయణ, గంజి వీరయ్య, కట్ట మహేందర్, ఎండి సువియాన్, లింగస్వామి తదితర టీడీపీ కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు

Article Image

యుగపురుషుడు ఎన్టీఆర్‌కు ఘన నివాళులు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పేదల పెన్నిధి, బడుగు–బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను రామన్నపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామన్నపేట ఏరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి మానవీయతను చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రామన్నపేట మండల నాయకులు ఎం. ఫజల్, బత్తుల సత్తయ్య మాట్లాడారు. ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడంతోనే పేదలకు రాజకీయ స్వేచ్ఛ, ఆత్మగౌరవం లభించాయని వారు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో విస్తృత అవకాశాలు కల్పించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం ఒక చరిత్ర అయితే, పాలనా దక్షతతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల దేవుడిగా ప్రజల గుండెల్లో నిలిచారని పేర్కొన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం, మండల వ్యవస్థ ఏర్పాటు, ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు నేటికీ కొనసాగుతున్నాయంటే అది ఎన్టీఆర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు.

ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎం. ప్రజల్, బత్తుల సత్తయ్య, పోచబోయిన మల్లేశం, ఉప్పల ప్రభాకర్, ఉప్పల సత్యనారాయణ, గంజి వీరయ్య, కట్ట మహేందర్, ఎండి సువియాన్, లింగస్వామి తదితర టీడీపీ కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News