రామన్నపేట వెళ్లి తిరిగిరాని యువకుడు,
రామన్నపేట వెళ్లి తిరిగిరాని యువకుడు,
స్థానికం బృందం
పది రోజులుగా గాలింపు… కుటుంబంలో ఆందోళన
స్థానికం ప్రతినిధి
రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన గుండాల శ్రీనివాస్ (38) అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. శ్రీనివాస్ భార్య గుండాల మల్లేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.డిసెంబర్ 3న ఉదయం 12 గంటల సమయంలో రామన్నపేటకు వెళ్లిన శ్రీనివాస్ ఆ తర్వాత ఇంటికి చేరుకోలేదు. డిసెంబర్ 13న తన తల్లితో చివరిసారిగా ఫోన్లో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత నుంచి అతని ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.బంధువుల ఇళ్లలో, పరిసర గ్రామాల్లో విస్తృతంగా వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు మల్లేశ్వరి తెలిపారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని రామన్నపేట ఎస్ఐ డి నాగరాజు వెల్లడించారు.అదృశ్యమైన శ్రీనివాస్ గురించి సమాచారం ఉన్న వారు సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి