Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:55 AM

రామన్నపేట ప్రీమియర్ లీగ్–4 క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం.సర్పంచ్ గరిక సత్యనారాయణ

రామన్నపేట ప్రీమియర్ లీగ్–4 క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం.సర్పంచ్ గరిక సత్యనారాయణ

రామన్నపేట ప్రీమియర్ లీగ్–4 క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం.సర్పంచ్ గరిక సత్యనారాయణ
January 19, 2026 06:01 PM 481 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో గరిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రామన్నపేట ప్రీమియర్ లీగ్ సీజన్–4 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో, నూతన సంవత్సరం–సంక్రాంతి శుభాకాంక్షల సందర్భంగా నిర్వహించిన ఈ టోర్నీలో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు.టోర్నీలో విజేతలుగా నిలిచిన జట్లకు రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ చేతుల మీదుగా ప్రధమ బహుమతిగా రూ.25,000, ద్వితీయ బహుమతిగా రూ.15,000లను ప్రదానం చేశారు. గ్రామీణ యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించడంతో పాటు, ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఈ టోర్నీని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు జెల్ల వెంకటేశం, గొలుసుల ప్రసాద్, గండికోట ప్రతాప్, మహమ్మద్ అజార్ పాల్గొని విజేతలను అభినందించారు. అలాగే క్రీడాకారులు వెంకటేష్, నరేష్, మజీద్, బాలు, మిట్టు, విష్ణు, నవీన్, వంశీ, శివ, బాలాజీ, ఆరిఫ్, చింటూ, ప్రవీణ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.గ్రామీణ స్థాయిలో ఇలాంటి క్రీడా పోటీలు యువతలో ఐక్యత, క్రమశిక్షణతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News