Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:09 PM

రామన్నపేట ప్రీమియర్ లీగ్–4 క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం.సర్పంచ్ గరిక సత్యనారాయణ

రామన్నపేట ప్రీమియర్ లీగ్–4 క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం.సర్పంచ్ గరిక సత్యనారాయణ

రామన్నపేట ప్రీమియర్ లీగ్–4 క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం.సర్పంచ్ గరిక సత్యనారాయణ
January 19, 2026 06:01 PM 476 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో గరిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రామన్నపేట ప్రీమియర్ లీగ్ సీజన్–4 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో, నూతన సంవత్సరం–సంక్రాంతి శుభాకాంక్షల సందర్భంగా నిర్వహించిన ఈ టోర్నీలో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు.టోర్నీలో విజేతలుగా నిలిచిన జట్లకు రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ చేతుల మీదుగా ప్రధమ బహుమతిగా రూ.25,000, ద్వితీయ బహుమతిగా రూ.15,000లను ప్రదానం చేశారు. గ్రామీణ యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించడంతో పాటు, ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఈ టోర్నీని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు జెల్ల వెంకటేశం, గొలుసుల ప్రసాద్, గండికోట ప్రతాప్, మహమ్మద్ అజార్ పాల్గొని విజేతలను అభినందించారు. అలాగే క్రీడాకారులు వెంకటేష్, నరేష్, మజీద్, బాలు, మిట్టు, విష్ణు, నవీన్, వంశీ, శివ, బాలాజీ, ఆరిఫ్, చింటూ, ప్రవీణ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.గ్రామీణ స్థాయిలో ఇలాంటి క్రీడా పోటీలు యువతలో ఐక్యత, క్రమశిక్షణతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News