Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 09:22 AM

రామన్నపేట నియోజకవర్గం పునరుద్ధరణకు ఏకగ్రీవ తీర్మానం

రామన్నపేట నియోజకవర్గం పునరుద్ధరణకు ఏకగ్రీవ తీర్మానం

రామన్నపేట నియోజకవర్గం పునరుద్ధరణకు ఏకగ్రీవ తీర్మానం
April 13, 2026 04:50 PM 86 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటను తిరిగి నియోజకవర్గంగా పునరుద్ధరించాలని మునిపంపుల గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, రామన్నపేట ఒకప్పుడు తాలూకా కేంద్రంగా, మునిసిపాలిటీగా ఉండి 1952 నుంచి 2009 వరకు నియోజకవర్గంగా ప్రాధాన్యం సంతరించుకుందని తెలిపారు. అనంతరం రద్దు చేసి నకిరేకల్ నియోజకవర్గంలో కలపడంతో అభివృద్ధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ ప్రాంతం తన స్వరూపాన్ని కోల్పోయిందని అన్నారు.

ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామన్నపేటను మళ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు అవసరమైన కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు ఇప్పటికే రామన్నపేటలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

నియోజకవర్గ పునరుద్ధరణ కోసం చేపట్టే పోరాటంలో గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతి కుమార్, వార్డు సభ్యులు యాదాసు మంగమ్మ, యాదాసు లక్ష్మణ్ కుమార్, మేకల రాములు, కూనూరు లక్ష్మమ్మ, గంటపాక శ్రీను, బూడిద నర్మద, నీల రజిత, మేకల జలంధర్, కట్ట అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News