రామన్నపేట లో రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026’
రామన్నపేట లో రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026’
స్థానికం బృందం
రామన్నపేటలో విస్తృత అవగాహన
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి
రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026’ను రామన్నపేట మండలంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సీఐ ఎన్ వెంకటేశ్వర్లు ఎస్ఐ డి నాగరాజు ఆధ్వర్యంలో విస్తృతంగా అమలు చేస్తున్నారు.ఈ సందర్భంగా వాహనదారులు, ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, రామన్నపేట ట్రావెల్స్ యజమానులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్డు ప్రయాణంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగించాల్సిందేనని సూచించారు.
అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ మాట్లాడటం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది శాశ్వత వికలాంగులుగా మారుతున్నారని, మరెందరో ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తు చేశారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు ప్రజలకు సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి