Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:05 PM

రామన్నపేట లో రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026’

రామన్నపేట లో రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026’

రామన్నపేట లో రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026’
January 21, 2026 04:30 PM 103 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో విస్తృత అవగాహన

రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026’ను రామన్నపేట మండలంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సీఐ ఎన్ వెంకటేశ్వర్లు ఎస్‌ఐ డి నాగరాజు ఆధ్వర్యంలో విస్తృతంగా అమలు చేస్తున్నారు.ఈ సందర్భంగా వాహనదారులు, ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, రామన్నపేట ట్రావెల్స్ యజమానులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్డు ప్రయాణంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగించాల్సిందేనని సూచించారు.

అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ మాట్లాడటం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది శాశ్వత వికలాంగులుగా మారుతున్నారని, మరెందరో ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తు చేశారు.

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు ప్రజలకు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News