రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో రోగుల ఇక్కట్లు ఫ్యాన్లు పనిచేయక ఉక్కపోత.. ప్రమాదకరంగా స్విచ్బోర్డులు
రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో రోగుల ఇక్కట్లు ఫ్యాన్లు పనిచేయక ఉక్కపోత.. ప్రమాదకరంగా స్విచ్బోర్డులు
Editor Desk
నిధులు ఉన్నా రోగులకు తప్పని ఇబ్బందులు
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో మౌలిక వసతుల కొరత రోగులకు శాపంగా మారింది. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వార్డుల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో పేషంట్లు ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు.
పురుషుల వార్డులో ఫ్యాన్లు తిరగకపోవడంతో పాటు స్విచ్బోర్డులు దెబ్బతిని ప్రమాదకరంగా మారాయని రోగులు వాపోతున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ఫ్యాన్లు పనిచేయడం లేదని, ఎండదెబ్బతో ఆస్పత్రికి వస్తే ఇక్కడ మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆస్పత్రికి సంబంధించిన మడిగల కిరాయిల రూపంలో ఇటీవల కాలంలో ఏప్రిల్ 16 వరకు రూ.40 లక్షలకు పైగా వసూలు చేసినప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎండాకాలం ముగిసే వరకు వార్డుల్లో కూలర్లు ఏర్పాటు చేసి, స్విచ్బోర్డులు మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి