రామన్నపేట డిగ్రీ కళాశాల అధ్యాపకునికి జిల్లాస్థాయి పురస్కారం
రామన్నపేట డిగ్రీ కళాశాల అధ్యాపకునికి జిల్లాస్థాయి పురస్కారం
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడు పి. వెంకటేశ్వరరావుకు జిల్లాస్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా అందజేశారు.
కళాశాలలో ఉపాధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ, దోస్త్ సమన్వయకర్తగా, రూసా సమన్వయకర్తగా, మత్తుపదార్థాల వ్యతిరేక కమిటీ కన్వీనర్గా, ఎన్సీసీ సంరక్షకునిగా పలు కీలక బాధ్యతలను వెంకటేశ్వరరావు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.కళాశాలలో నిర్వహించే విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, విద్యార్థుల విద్యా ప్రగతి, వ్యక్తిత్వ వికాసానికి నిరంతరం కృషి చేస్తున్న ఆయన సేవలను గుర్తించి జిల్లాస్థాయి పురస్కారంతో సత్కరించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం వెంకటేశ్వరరావును అభినందిస్తూ, ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి