Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 02:00 AM

రామన్నపేట 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక విజయవంతం

రామన్నపేట 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక విజయవంతం

 రామన్నపేట 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక విజయవంతం
January 30, 2026 07:26 PM 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం శాంతియుతంగా, సక్రమంగా ముగిసింది. మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలో అమలవుతున్న అభివృద్ధి, ఉపాధి పనులపై ప్రజల ముందే సమీక్ష జరిపి, లెక్కలు వెల్లడించారు.

ప్రీసైడింగ్ అధికారి అడిషనల్ డీఆర్‌డీఓ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రజా వేదికలో జిల్లా విజిలెన్స్ అధికారి ఉపేందర్ రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ అధికారి ఫసిమెద్దిన్ పర్యవేక్షణ చేశారు. మండల అభివృద్ధి అధికారి ఎ. రాములు, సహాయ మండల పంచాయతీ అధికారి మరియు మండల పంచాయతీ అధికారి ఎం.డి. రవూఫ్ అలీ, సామాజిక తనిఖీ ఎస్‌ఆర్‌పీ అశోక్, ఏపీఓ ఎ.పీ. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ తనిఖీ సిబ్బంది, సర్పంచులు, పాల్గొని ప్రజా వేదికను విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News