PRINT TIME: May 26, 2026 04:39 PM
రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎంపీ చామల ఘన నివాళి
రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎంపీ చామల ఘన నివాళి
May 21, 2026 02:44 PM
18 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్, భారత రత్న, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సచివాలయంలోని ఆయన విగ్రహానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను ఎంపీ స్మరించుకున్నారు. స్థానిక పాలనను బలోపేతం చేసేలా తీసుకొచ్చిన సంస్కరణలు, సమాచార సాంకేతిక రంగంలో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు దేశ భవిష్యత్తును మార్చేశాయని కొనియాడారు. రాజీవ్ గాంధీ దూరదృష్టితోనే భారత్ ఆధునిక సాంకేతిక రంగంలో ముందంజలో నిలిచిందని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి