Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుటుంబానికి అండగా పూస బాలకిషన్ రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేత. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 11:03 AM

రాజాం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సోషల్ మీడియా సైనికులు కృషి చేయాలి - రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. రాజేష్ తలే.

రాజాం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సోషల్ మీడియా సైనికులు కృషి చేయాలి - రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. రాజేష్ తలే.

రాజాం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సోషల్ మీడియా సైనికులు కృషి చేయాలి - రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. రాజేష్ తలే.
January 30, 2026 01:28 PM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా సోషల్ మీడియా సైనికులు కృషి చేయాలని రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. రాజేష్ తలే పిలుపునిచ్చారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలు మరియు రాజాం పట్టణం గ్రామ, వార్డు అనుబంధ విభాగాలు, ప్రధాన కమిటీలు డిజిటలైజేషన్ కోసం మీ వంతు సహాయ సహకారాలు అందించాలని సోషల్ మీడియా సైనికులకు కోరడం జరిగింది. ఈ సందర్భంగా రాజాం పట్టణంలో సన్ రైస్ హాస్పిటల్ వద్ద సోషల్ మీడియా సైనికులతో ఏర్పాటు చేసిన మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా డా. రాజేష్ తలే మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు గ్రామ, మండల స్థాయి కమిటీలు, అనుబంధ విభాగాలు కమిటీలు డిజిటలైజేషన్ కోసం మీ వంతు సహాయ సహకారాలు అందించాలని సోషల్ మీడియా ద్వారా కృషి చేయాలని తెలియజేశారు. స్థానిక సంస్థలు ఎన్నికలు నాటికి మన పార్టీ మరింత బలోపేతం చేయడమే మా లక్ష్యం అన్నారు. ఆ దిశగా ప్రతీ ఒక్క సోషల్ మీడియా సైనికుడు పనిచేయాలని రాజేష్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు వై. వాసు నాయుడు, జిల్లా సాంస్కృత విభాగం అధ్యక్షుడు డా.బలివాడ నరేంద్ర కుమార్, రాజాం అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు అగిరీడు వీరస్వామి, జిల్లా సోషల్ మీడియా కార్యవర్గ సభ్యులు బెండు లక్ష్మణ రావు, కోట గణేష్, కంట జగదీష్ చంద్ర, అడపాక గణపతి నాయుడు, వంగర మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు బెవర రామకృష్ణ, సంతకవిటి మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు దెబారికి రాజు, రాజాం రూరల్ మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు బట్నా వంశీ,రేగడి మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు బంకి రాంబాబు తదితరులు పాల్గొనారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News