Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భద్రతపై గ్రామస్తుల జాగ్రత్తలు.. సీసీ కెమెరాల ఏర్పాటు సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 02:22 PM

రైతులకు మద్దతుగా ప్రత్యేక ప్రోత్సాహాలు – తీగల గిరిధర్ రెడ్డి

రైతులకు మద్దతుగా ప్రత్యేక ప్రోత్సాహాలు – తీగల గిరిధర్ రెడ్డి

రైతులకు మద్దతుగా ప్రత్యేక ప్రోత్సాహాలు – తీగల గిరిధర్ రెడ్డి
April 13, 2026 12:37 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


తుంగతుర్తి: మండలంలోని అన్నారంగ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి , వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సన్నాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాకు ఐదు వందల రూపాయల ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తున్నట్లు గుర్తు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్, రుణ మాఫీ, రైతు భరోసా వంటి పథకాలతో పాటు ఈ ప్రోత్సాహకం అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు.తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తూ రైతులకు న్యాయం చేస్తున్నదని తెలిపారు. రైతుల వద్దే ధాన్యం కొనుగోలు చేసి తిరిగి ప్రజలకు అందించే విధానం అమలు చేస్తున్నామని చెప్పారు.అందువల్ల రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రాల వద్ద కప్పే సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. తేమ పదిహేడు శాతం ఉండేలా చూడాలని, బస్తా నలభై ఒక కిలోలకే తూకం వేయాలని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, రైతులు, పాలకవర్గ సభ్యులు, ఐజేపి నీర్వాకులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News