ధర్మోజిగూడెంలో లక్ష బస్తాల సామర్థ్యంతో నూతన గోదాం ప్రారంభం
చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం: ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య
రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ, వారికి నిరంతరం అండదండగా నిలుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ ఉబ్బు వెంకటయ్య స్పష్టం చేశారు. సోమవారం చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో రైతులు ధాన్యం నిల్వ చేసుకునేందుకు వీలుగా నూతనంగా నిర్మించిన గోదాంను స్థానిక సర్పంచ్ జువ్వి నర్సింహ్మతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఉబ్బు వెంకటయ్య మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే ప్రతి రైతు పండించిన చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కొనుగోళ్లు చాలా వేగవంతంగా సాగుతున్నాయని, త్వరలోనే ఈ ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు."రైతులకు నిల్వ సమస్యలు రాకుండా ఉండేందుకే ఈ నూతన గోదామును అందుబాటులోకి తెచ్చాం. దీని సామర్థ్యం దాదాపు లక్ష ధాన్యం బస్తాల వరకు ఉంటుంది. వర్షాలు, ఇతర ఇబ్బందుల నుండి రైతులు తమ పంటను ఇక్కడ భద్రపరుచుకోవచ్చు."ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీహరి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాచకొండ భార్గవ్, ఐతరాజు లింగస్వామి, ఊదరి స్వామి, ఐతరాజు శివ, ఏపీఎం యాదయ్య, జీపీవో గాలయ్య, బద్రి గణేష్, స్థానిక రైతులు, నాయకులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి