Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:21 PM

రైతు సంఘం పోరాట ఫలితంగానే కందుల కొనుగోలు కేంద్రాల ప్రారంభం

రైతు సంఘం పోరాట ఫలితంగానే కందుల కొనుగోలు కేంద్రాల ప్రారంభం

రైతు సంఘం పోరాట ఫలితంగానే కందుల కొనుగోలు కేంద్రాల ప్రారంభం
January 23, 2026 06:33 PM 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సాగిన పోరాటాల ఫలితంగానే కందుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని సిపిఐ నాయకులు స్పష్టం చేశారు. ఆదోని మండలంలో రైతులు పండించిన కంది పంట మొత్తాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేడీసీఎంఎస్ అధికారులకు అనుమతి ఇచ్చిందని రైతు సంఘం సీనియర్ నాయకులు కే. లక్ష్మిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుదర్శన్, సిపిఐ ఆదోని మండల కార్యదర్శి కల్లుబావి రాజు తెలిపారు.

స్థానిక ఆదోని మార్కెట్ యార్డులో కొద్ది రోజులుగా కొనసాగుతున్న కందుల కొనుగోలు కేంద్రాన్ని సిపిఐ, రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల మధ్య రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్ యార్డుకు తీసుకొస్తే అధికారులు నాణ్యత లేదని, తాలు, తబకలు, గింజలు పుచ్చు పట్టాయని రకరకాల పేర్లు పెట్టి కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం రైతులకు ఒక మాట, అధికారులకు మరో మాట చెప్పడం చంద్రబాబు ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్యగా మారిందని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే మార్చుకోకపోతే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.రైతులు తీసుకొచ్చిన కందులను నాణ్యత పేరుతో తిరస్కరించి చిత్రహింసలకు గురి చేస్తే కొనుగోలు కేంద్రాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News