‘రైతు గోసా - బీజేపీ భరోసా’ యాత్రకు సన్నాహాలు కాంగ్రెస్ హామీలు వెంటనే అమలు చేయాలి: వేముల అశోక్
‘రైతు గోసా - బీజేపీ భరోసా’ యాత్రకు సన్నాహాలు కాంగ్రెస్ హామీలు వెంటనే అమలు చేయాలి: వేముల అశోక్
Editor Desk
: రైతుల సమస్యలపై భారతీయ జనతా పార్టీ ఈ నెల 26 నుంచి ‘రైతు గోసా - బీజేపీ భరోసా’ పేరుతో యాత్ర చేపట్టనుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గజ్వేల్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర జిల్లా మీదుగా వివిధ మండలాల్లో కొనసాగుతుందని చెప్పారు. రైతులతో నేరుగా మాట్లాడి ధాన్యం కొనుగోళ్ల పరిస్థితులను తెలుసుకుంటామని పేర్కొన్నారు.
రెండు రోజుల పాటు రైతులతోనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడిస్తామని, తమకు ముఖ్యంగా రైతుల సంక్షేమమే లక్ష్యమని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ యాత్రను విజయవంతం చేసేందుకు అధిక సంఖ్యలో రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాయ దశరథ్, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు పట్నం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి, భువనగిరి పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, పాదరాజు ఉమాశంకర్, బబ్బూరి సురేష్, మండల అధ్యక్షుడు చిరిక సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి