Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:59 PM

‘రైతు గోసా - బీజేపీ భరోసా’ యాత్రకు సన్నాహాలు కాంగ్రెస్ హామీలు వెంటనే అమలు చేయాలి: వేముల అశోక్

‘రైతు గోసా - బీజేపీ భరోసా’ యాత్రకు సన్నాహాలు కాంగ్రెస్ హామీలు వెంటనే అమలు చేయాలి: వేముల అశోక్

‘రైతు గోసా - బీజేపీ భరోసా’ యాత్రకు సన్నాహాలు కాంగ్రెస్ హామీలు వెంటనే అమలు చేయాలి: వేముల అశోక్
May 24, 2026 07:44 PM 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: రైతుల సమస్యలపై భారతీయ జనతా పార్టీ ఈ నెల 26 నుంచి ‘రైతు గోసా - బీజేపీ భరోసా’ పేరుతో యాత్ర చేపట్టనుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎన్‌ఆర్ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గజ్వేల్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర జిల్లా మీదుగా వివిధ మండలాల్లో కొనసాగుతుందని చెప్పారు. రైతులతో నేరుగా మాట్లాడి ధాన్యం కొనుగోళ్ల పరిస్థితులను తెలుసుకుంటామని పేర్కొన్నారు.

రెండు రోజుల పాటు రైతులతోనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడిస్తామని, తమకు ముఖ్యంగా రైతుల సంక్షేమమే లక్ష్యమని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ యాత్రను విజయవంతం చేసేందుకు అధిక సంఖ్యలో రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాయ దశరథ్, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు పట్నం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి, భువనగిరి పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, పాదరాజు ఉమాశంకర్, బబ్బూరి సురేష్, మండల అధ్యక్షుడు చిరిక సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News