రెండేళ్ల విరామానికి బ్రేక్… నిదానపల్లిలో తిరిగి మొదలైన చెత్త ట్రాక్టర్
రెండేళ్ల విరామానికి బ్రేక్… నిదానపల్లిలో తిరిగి మొదలైన చెత్త ట్రాక్టర్
Editor Desk
గ్రామ పరిశుభ్రతకు శ్రీకారం… నిదానపల్లిలో చెత్త ట్రాక్టర్ ప్రారంభం
స్థానికం ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో చెత్త ట్రాక్టర్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.
గత రెండు సంవత్సరాలుగా గ్రామపంచాయతీలో నిధుల కొరత కారణంగా చెత్త ట్రాక్టర్ నిర్వీర్యంగా ఉండటంతో గ్రామంలో పారిశుధ్య సమస్యలు తలెత్తాయి.కొత్త సంవత్సరం సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ప్రత్యేక ప్రణాళికలతో శుక్రవారం చెత్త ట్రాక్టర్ను గ్రామ వీధుల్లోకి తీసుకువచ్చారు. ట్రాక్టర్తో పాటు చెత్త బండిని గ్రామమంతా తిప్పుతూ,
“చెత్త బండి వచ్చిందమ్మా… చెత్తను డాక్టర్లలో వేయండి” అనే ఆసక్తికరమైన పాటలతో ప్రజల్లో అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం గ్రామంలో మంచి స్పందన పొందింది. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని సర్పంచ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. చెత్తను నిర్దిష్ట ప్రదేశాల్లోనే వేయడం ద్వారా ఆరోగ్యకరమైన గ్రామాన్ని నిర్మించవచ్చని తెలిపారు.చెత్త ట్రాక్టర్ సేవలు పునఃప్రారంభం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పరిశుభ్రతతో పాటు గ్రామాభివృద్ధి దిశగా ఇది కీలక ముందడుగుగా గ్రామస్తులు అభిప్రాయపడ్డారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి