రామన్నపేటలో నిషేధిత చైనా మాంజా స్వాధీనం
రామన్నపేటలో నిషేధిత చైనా మాంజా స్వాధీనం
Editor Desk
ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 10 బండిల్స్ – నిందితుడిపై కేసు నమోదు
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట గ్రామానికి చెందిన కావేటి సతీష్ (తండ్రి: బాలనరసింహ) తన ఇంట్లో ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాను అక్రమంగా నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో పోలీసుల తనిఖీల్లో 10 బండిల్స్ చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు.స్థానిక ఎస్ఐ డి. నాగరాజు ఆదేశాల మేరకు రామన్నపేట పోలీసు సిబ్బంది ప్రశాంత్, రాఘవేందర్లు మంగళవారం సాయంత్రం నిందితుడి నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిషేధిత చైనా మాంజా భారీగా లభ్యమైంది. చైనా మాంజాను అమ్మడం గానీ, నిల్వ ఉంచడం గానీ చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కావేటి సతీష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ డి. నాగరాజు వెల్లడించారు. రామన్నపేట మండలంలో ఎవరైనా ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాను కలిగి ఉన్నా, నిల్వ చేసినా లేదా విక్రయించినా వారి పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి