Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:17 AM

రామన్నపేట మండలంలో జీవో కాపీ దహనం – బిల్లు రద్దు వరకు ఉద్యమం: వనం ఉపేందర్

రామన్నపేట మండలంలో జీవో కాపీ దహనం – బిల్లు రద్దు వరకు ఉద్యమం: వనం ఉపేందర్

రామన్నపేట మండలంలో జీవో కాపీ దహనం – బిల్లు రద్దు వరకు ఉద్యమం: వనం ఉపేందర్
07-01-2026 103 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్–రోజ్‌గార్ మరియు ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు–2025 (VB-GRAMG) వికలాంగుల జీవనోపాధి హక్కులను తీవ్రంగా దెబ్బతీస్తోందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నపేట మండలం కక్కిరేణి, జనంపల్లి గ్రామాల్లో జీవో కాపీని దహనం చేశారు. అనంతరం ఫిబ్రవరి 21, 22, 23 తేదీల్లో యాదగిరిగుట్టలో నిర్వహించనున్న రాష్ట్ర క్లాసులను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ కరపత్రం విడుదల చేశారు.

ఈ సందర్భంగా వనం ఉపేందర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకొచ్చిన ఈ బిల్లు గ్రామీణ వికలాంగ కార్మికుల ఉపాధిని నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇప్పటికే నిధుల కొరత, పని నిరాకరణ, డిజిటల్ హాజరు వంటి కారణాలతో వికలాంగులకు ఉపాధి రోజులు తగ్గాయని తెలిపారు. VB-GRAMG బిల్లు అమలైతే వికలాంగులు మరింత పేదరికంలోకి నెట్టబడతారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి నాయకులు పున్న శ్రీధర్, మేడబోయిన రమేష్, చెప్పరి చంద్రయ్య, వరికుప్పల యాదయ్య, సుంకి వెంకటేశం, అక్కెనపల్లి మహేష్, కక్కిరేణి గ్రామ అధ్యక్షురాలు కన్నేబోయిన మంగమ్మ, చిల్ల రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట మండలంలో జీవో కాపీ దహనం – బిల్లు రద్దు వరకు ఉద్యమం: వనం ఉపేందర్

Article Image

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్–రోజ్‌గార్ మరియు ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు–2025 (VB-GRAMG) వికలాంగుల జీవనోపాధి హక్కులను తీవ్రంగా దెబ్బతీస్తోందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నపేట మండలం కక్కిరేణి, జనంపల్లి గ్రామాల్లో జీవో కాపీని దహనం చేశారు. అనంతరం ఫిబ్రవరి 21, 22, 23 తేదీల్లో యాదగిరిగుట్టలో నిర్వహించనున్న రాష్ట్ర క్లాసులను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ కరపత్రం విడుదల చేశారు.

ఈ సందర్భంగా వనం ఉపేందర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకొచ్చిన ఈ బిల్లు గ్రామీణ వికలాంగ కార్మికుల ఉపాధిని నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇప్పటికే నిధుల కొరత, పని నిరాకరణ, డిజిటల్ హాజరు వంటి కారణాలతో వికలాంగులకు ఉపాధి రోజులు తగ్గాయని తెలిపారు. VB-GRAMG బిల్లు అమలైతే వికలాంగులు మరింత పేదరికంలోకి నెట్టబడతారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి నాయకులు పున్న శ్రీధర్, మేడబోయిన రమేష్, చెప్పరి చంద్రయ్య, వరికుప్పల యాదయ్య, సుంకి వెంకటేశం, అక్కెనపల్లి మహేష్, కక్కిరేణి గ్రామ అధ్యక్షురాలు కన్నేబోయిన మంగమ్మ, చిల్ల రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News