Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:12 AM

రామన్నపేట మండలంలో జీవో కాపీ దహనం – బిల్లు రద్దు వరకు ఉద్యమం: వనం ఉపేందర్

రామన్నపేట మండలంలో జీవో కాపీ దహనం – బిల్లు రద్దు వరకు ఉద్యమం: వనం ఉపేందర్

రామన్నపేట మండలంలో జీవో కాపీ దహనం – బిల్లు రద్దు వరకు ఉద్యమం: వనం ఉపేందర్
January 07, 2026 07:00 PM 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్–రోజ్‌గార్ మరియు ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు–2025 (VB-GRAMG) వికలాంగుల జీవనోపాధి హక్కులను తీవ్రంగా దెబ్బతీస్తోందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నపేట మండలం కక్కిరేణి, జనంపల్లి గ్రామాల్లో జీవో కాపీని దహనం చేశారు. అనంతరం ఫిబ్రవరి 21, 22, 23 తేదీల్లో యాదగిరిగుట్టలో నిర్వహించనున్న రాష్ట్ర క్లాసులను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ కరపత్రం విడుదల చేశారు.

ఈ సందర్భంగా వనం ఉపేందర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకొచ్చిన ఈ బిల్లు గ్రామీణ వికలాంగ కార్మికుల ఉపాధిని నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇప్పటికే నిధుల కొరత, పని నిరాకరణ, డిజిటల్ హాజరు వంటి కారణాలతో వికలాంగులకు ఉపాధి రోజులు తగ్గాయని తెలిపారు. VB-GRAMG బిల్లు అమలైతే వికలాంగులు మరింత పేదరికంలోకి నెట్టబడతారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి నాయకులు పున్న శ్రీధర్, మేడబోయిన రమేష్, చెప్పరి చంద్రయ్య, వరికుప్పల యాదయ్య, సుంకి వెంకటేశం, అక్కెనపల్లి మహేష్, కక్కిరేణి గ్రామ అధ్యక్షురాలు కన్నేబోయిన మంగమ్మ, చిల్ల రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News