Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:40 PM

రామన్నపేట మండలంలో జీవో కాపీ దహనం – బిల్లు రద్దు వరకు ఉద్యమం: వనం ఉపేందర్

రామన్నపేట మండలంలో జీవో కాపీ దహనం – బిల్లు రద్దు వరకు ఉద్యమం: వనం ఉపేందర్

రామన్నపేట మండలంలో జీవో కాపీ దహనం – బిల్లు రద్దు వరకు ఉద్యమం: వనం ఉపేందర్
January 07, 2026 07:00 PM 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్–రోజ్‌గార్ మరియు ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు–2025 (VB-GRAMG) వికలాంగుల జీవనోపాధి హక్కులను తీవ్రంగా దెబ్బతీస్తోందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నపేట మండలం కక్కిరేణి, జనంపల్లి గ్రామాల్లో జీవో కాపీని దహనం చేశారు. అనంతరం ఫిబ్రవరి 21, 22, 23 తేదీల్లో యాదగిరిగుట్టలో నిర్వహించనున్న రాష్ట్ర క్లాసులను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ కరపత్రం విడుదల చేశారు.

ఈ సందర్భంగా వనం ఉపేందర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకొచ్చిన ఈ బిల్లు గ్రామీణ వికలాంగ కార్మికుల ఉపాధిని నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇప్పటికే నిధుల కొరత, పని నిరాకరణ, డిజిటల్ హాజరు వంటి కారణాలతో వికలాంగులకు ఉపాధి రోజులు తగ్గాయని తెలిపారు. VB-GRAMG బిల్లు అమలైతే వికలాంగులు మరింత పేదరికంలోకి నెట్టబడతారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి నాయకులు పున్న శ్రీధర్, మేడబోయిన రమేష్, చెప్పరి చంద్రయ్య, వరికుప్పల యాదయ్య, సుంకి వెంకటేశం, అక్కెనపల్లి మహేష్, కక్కిరేణి గ్రామ అధ్యక్షురాలు కన్నేబోయిన మంగమ్మ, చిల్ల రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News