శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో బుధవారం గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 43వ పుట్టినరోజు సందర్భంగా పుట్టపర్తి లో ఉన్న ఎన్టీఆర్_ఫ్యాన్స్ అధ్యక్షుడు షామీర్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
షామీర్ మాట్లాడుతూ...ముందుగా పుట్టపర్తి గ్రామదేవత సత్తెమ్మ గుడిలో ఎన్టీఆర్ మీదుగా పూజ చేయించి అలాగే అభిమానుల మధ్య కేక్ కటింగ్ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం
కర్ణాటక నాగేపల్లి దగ్గర గుడిసెల్లో ఉన్న నిరుపేద 100 కుటుంబాలకు స్టీల్ గ్లాసు, మజ్జిగ, పండ్లు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, రామంజి ,సురేష్, శ్రీనివాసులు ,రాజు, దామోదర్, రామంజి, గణేష్ ,మురుగేష్,మణికంఠ, నాగేంద్ర, వేణు, ,ఖాసీం, సాదిక్, జావీద్ ,సాయి, విష్ణు, యాసీన్, రాము, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి