పులి సంచారం.. రాత్రి బయటికు వెళ్ళొద్దు
పులి సంచారం.. రాత్రి బయటికు వెళ్ళొద్దు
Editor Desk
స్థానిక ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా
భువనగిరి మండలం బెగంపేట పరిసర గ్రామాల్లో పులి సంచరిస్తోందన్న సమాచారం గ్రామస్తుల్లో భయాందోళనకు గురి చేస్తోంది. గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో పులి సంచారం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
పులి కదలికలను గమనించిన గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది పులి పాదముద్రలను పరిశీలించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని, పొలాల వద్ద జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. పులిని పట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇదే సమయంలో గ్రామాల్లో మైక్ ప్రకటనల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూ, అనవసరంగా బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి