Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:38 AM

ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యం

ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యం

ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యం
January 14, 2026 05:46 AM 242 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అద్దె భవనాల్లోని కార్యాలయాల స్థానంలో సొంత భవనాల వినియోగం

రామన్నపేట (స్థానిక ప్రతినిధి):

ప్రభుత్వంపై పడుతున్న అనవసర ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని తహసిల్దార్ లాల్ బహదూర్ శాస్త్రి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ అద్దె భవనాల్లో కొనసాగడం వల్ల సంవత్సరానికి సుమారు రూ.8 వేల కోట్ల మేర ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ ఆదేశాల ప్రకారం మండల పరిధిలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించి, ప్రభుత్వ సొంత భవనాల్లోకి తరలించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ, ఎస్సీ బాలుర వసతి గృహం, ఆర్ అండ్ బి శాఖ, రిజిస్ట్రేషన్ కార్యాలయం తదితర కార్యాలయాల కోసం అనువైన ప్రభుత్వ భవనాలను గుర్తించినట్లు పేర్కొన్నారు.ఎంపీడీవో ఆవుల రాములు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పరిశీలన అనంతరం, గుర్తించిన భవనాలకు అవసరమైన మరమ్మతుల కోసం ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మరమ్మతుల పనులు పూర్తయిన వెంటనే సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి తరలిస్తామని స్పష్టం చేశారు.ఈ చర్యల ద్వారా అద్దె ఖర్చులను పూర్తిగా ఆదా చేసి, ప్రభుత్వ నిధులను ప్రజా సంక్షేమానికి మరింత సమర్థవంతంగా వినియోగించవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల వెంకట్ రాజిరెడ్డి, గోదాసు పృథ్వీ, గుత్తా నర్సిరెడ్డి, బొడ్డు సురేందర్రావు, ఎండి నాసర్, ఉప సర్పంచ్ మోటే రమేష్, గొరిగే శేఖర్, కొమ్ము శేఖర్, మోటి మహేష్, ఎండి జమీరుద్దీన్, ఎండి ఆక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News