ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ హనుమంతరావు
ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ హనుమంతరావు
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంలో వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు.శుక్రవారం ఆలేరు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు రిజిస్టర్, మందుల లభ్యతను పరిశీలించారు. రోజువారీ ఓపీకి వచ్చే రోగుల సంఖ్య, గర్భిణీ స్త్రీల చెకప్లు, నెలవారీ డెలివరీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలని సూచించారు.
ఆశా కార్యకర్తలు గర్భిణీలతో నిరంతరం సంప్రదింపులు జరిపి సమయానికి చెకప్లు చేయించుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. డాక్టర్ల హాజరు, మధ్యాహ్న భోజనం నాణ్యతపై కూడా ఆరా తీశారు.ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి