Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:05 AM

ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందించాలి  జిల్లా కలెక్టర్ హనుమంతరావు
16-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంలో వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు.శుక్రవారం ఆలేరు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు రిజిస్టర్, మందుల లభ్యతను పరిశీలించారు. రోజువారీ ఓపీకి వచ్చే రోగుల సంఖ్య, గర్భిణీ స్త్రీల చెకప్‌లు, నెలవారీ డెలివరీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలని సూచించారు.

ఆశా కార్యకర్తలు గర్భిణీలతో నిరంతరం సంప్రదింపులు జరిపి సమయానికి చెకప్‌లు చేయించుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. డాక్టర్ల హాజరు, మధ్యాహ్న భోజనం నాణ్యతపై కూడా ఆరా తీశారు.ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంలో వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు.శుక్రవారం ఆలేరు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు రిజిస్టర్, మందుల లభ్యతను పరిశీలించారు. రోజువారీ ఓపీకి వచ్చే రోగుల సంఖ్య, గర్భిణీ స్త్రీల చెకప్‌లు, నెలవారీ డెలివరీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలని సూచించారు.

ఆశా కార్యకర్తలు గర్భిణీలతో నిరంతరం సంప్రదింపులు జరిపి సమయానికి చెకప్‌లు చేయించుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. డాక్టర్ల హాజరు, మధ్యాహ్న భోజనం నాణ్యతపై కూడా ఆరా తీశారు.ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News