పొలాల నీరు రోడ్డుపైకి… లక్ష్మాపురం–రామన్నపేట రహదారిపై ప్రయాణికుల అవస్థలు
పొలాల నీరు రోడ్డుపైకి… లక్ష్మాపురం–రామన్నపేట రహదారిపై ప్రయాణికుల అవస్థలు
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం–రామన్నపేట ప్రధాన రహదారిపై పొలాల నుంచి వచ్చిన నీరు తరచూ రోడ్డుమీదికి చేరుతుండటంతో ప్రయాణికుల సహనం పరీక్షకు నిలుస్తోంది. సాగునీరు రోడ్డంతా వ్యాపించడంతో ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం పొంచి ఉండగా, ఆటో-కారు ప్రయాణికులు నెమ్మదిగా సాగాల్సిన పరిస్థితి నెలకొంది.అసిఫ్ నగర్ కాలువకు ఆనుకుని ఉన్న పొలాల్లో కొందరు రైతులు మోతాదుకు మించి నీటిని వినియోగించడం వల్లే ఈ సమస్య ఉధృతమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారిపై నిరంతర నీటి ప్రవాహం కొనసాగితే బీటీ రోడ్డు త్వరలోనే దెబ్బతిని, మరమ్మతులకు భారీ వ్యయం తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది.ఇకపోతే పొలాల వరద నీరు రోడ్డుపైకి రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించేందుకు రైతులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, అలాగే ట్రాక్టర్ క్రేజీ వీల్స్ రోడ్డుపై ప్రయాణించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి