Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని పరామర్శి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 08:51 PM

పొలాల నీరు రోడ్డుపైకి… లక్ష్మాపురం–రామన్నపేట రహదారిపై ప్రయాణికుల అవస్థలు

పొలాల నీరు రోడ్డుపైకి… లక్ష్మాపురం–రామన్నపేట రహదారిపై ప్రయాణికుల అవస్థలు

పొలాల నీరు రోడ్డుపైకి… లక్ష్మాపురం–రామన్నపేట రహదారిపై ప్రయాణికుల అవస్థలు
18-01-2026 160 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం–రామన్నపేట ప్రధాన రహదారిపై పొలాల నుంచి వచ్చిన నీరు తరచూ రోడ్డుమీదికి చేరుతుండటంతో ప్రయాణికుల సహనం పరీక్షకు నిలుస్తోంది. సాగునీరు రోడ్డంతా వ్యాపించడంతో ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం పొంచి ఉండగా, ఆటో-కారు ప్రయాణికులు నెమ్మదిగా సాగాల్సిన పరిస్థితి నెలకొంది.అసిఫ్ నగర్ కాలువకు ఆనుకుని ఉన్న పొలాల్లో కొందరు రైతులు మోతాదుకు మించి నీటిని వినియోగించడం వల్లే ఈ సమస్య ఉధృతమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారిపై నిరంతర నీటి ప్రవాహం కొనసాగితే బీటీ రోడ్డు త్వరలోనే దెబ్బతిని, మరమ్మతులకు భారీ వ్యయం తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది.ఇకపోతే పొలాల వరద నీరు రోడ్డుపైకి రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించేందుకు రైతులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, అలాగే ట్రాక్టర్ క్రేజీ వీల్స్ రోడ్డుపై ప్రయాణించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Sthanikam

పొలాల నీరు రోడ్డుపైకి… లక్ష్మాపురం–రామన్నపేట రహదారిపై ప్రయాణికుల అవస్థలు

Article Image
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం–రామన్నపేట ప్రధాన రహదారిపై పొలాల నుంచి వచ్చిన నీరు తరచూ రోడ్డుమీదికి చేరుతుండటంతో ప్రయాణికుల సహనం పరీక్షకు నిలుస్తోంది. సాగునీరు రోడ్డంతా వ్యాపించడంతో ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం పొంచి ఉండగా, ఆటో-కారు ప్రయాణికులు నెమ్మదిగా సాగాల్సిన పరిస్థితి నెలకొంది.అసిఫ్ నగర్ కాలువకు ఆనుకుని ఉన్న పొలాల్లో కొందరు రైతులు మోతాదుకు మించి నీటిని వినియోగించడం వల్లే ఈ సమస్య ఉధృతమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారిపై నిరంతర నీటి ప్రవాహం కొనసాగితే బీటీ రోడ్డు త్వరలోనే దెబ్బతిని, మరమ్మతులకు భారీ వ్యయం తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది.ఇకపోతే పొలాల వరద నీరు రోడ్డుపైకి రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించేందుకు రైతులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, అలాగే ట్రాక్టర్ క్రేజీ వీల్స్ రోడ్డుపై ప్రయాణించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News