పండరీపూర్ మహా పాదయాత్రలో పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మచ్చేందర్
పండరీపూర్ మహా పాదయాత్రలో పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మచ్చేందర్
Sthanikam District Staff Reporter krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ రామలింగేశ్వర గుట్ట నుండి మల్లూరు మహారాజ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన పండరీపూర్ మహా పాదయాత్ర కార్యక్రమంలో కంగ్టి మండలానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు,జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్,భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు గుర్రపు మచ్చేందర్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుర్రపు మచ్చేందర్ భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొంటూ, ఆధ్యాత్మిక కార్యక్రమానికి తన వంతు సహకారం అందించారు. ఈ మహా పాదయాత్ర ద్వారా భక్తులలో భక్తి భావం మరింతగా పెరుగుతుందని,ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సద్భావనను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.పండరీపూర్ విఠలుని కృపతో ప్రజలందరికీ శాంతి,
సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.ఈ మహా పాదయాత్ర సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, విఠల నామస్మరణతో మార్గమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.భక్తి గీతాలు,జయఘోషలతో పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగింది.ఈ కార్యక్రమంలో అశోక్ మహారాజ్, మారుతి మహారాజ్, బీబీపేట మాజీ ఎంపిటిసి మహారెడ్డి నాగిరెడ్డి, కృష్ణాపూర్ మాజీ ఎంపిటిసి అంజయ్య సాగర్, దామర్గిద మాజీ సర్పంచ్ శంకర్ సాగర్, భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు మారపు సాయిలు, సురేందర్ రెడ్డి, నర్సింగ్ రావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి