Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:19 PM

పండరీపూర్ మహా పాదయాత్రలో పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మచ్చేందర్

పండరీపూర్ మహా పాదయాత్రలో పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మచ్చేందర్

పండరీపూర్ మహా పాదయాత్రలో పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మచ్చేందర్
January 16, 2026 06:08 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ రామలింగేశ్వర గుట్ట నుండి మల్లూరు మహారాజ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన పండరీపూర్ మహా పాదయాత్ర కార్యక్రమంలో కంగ్టి మండలానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు,జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్,భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు గుర్రపు మచ్చేందర్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుర్రపు మచ్చేందర్ భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొంటూ, ఆధ్యాత్మిక కార్యక్రమానికి తన వంతు సహకారం అందించారు. ఈ మహా పాదయాత్ర ద్వారా భక్తులలో భక్తి భావం మరింతగా పెరుగుతుందని,ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సద్భావనను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.పండరీపూర్ విఠలుని కృపతో ప్రజలందరికీ శాంతి,

సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.ఈ మహా పాదయాత్ర సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, విఠల నామస్మరణతో మార్గమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.భక్తి గీతాలు,జయఘోషలతో పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగింది.ఈ కార్యక్రమంలో అశోక్ మహారాజ్, మారుతి మహారాజ్, బీబీపేట మాజీ ఎంపిటిసి మహారెడ్డి నాగిరెడ్డి, కృష్ణాపూర్ మాజీ ఎంపిటిసి అంజయ్య సాగర్, దామర్గిద మాజీ సర్పంచ్ శంకర్ సాగర్, భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు మారపు సాయిలు, సురేందర్ రెడ్డి, నర్సింగ్ రావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News