Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:46 PM

పండరీపూర్ మహా పాదయాత్రలో పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మచ్చేందర్

పండరీపూర్ మహా పాదయాత్రలో పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మచ్చేందర్

పండరీపూర్ మహా పాదయాత్రలో పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మచ్చేందర్
January 16, 2026 06:08 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ రామలింగేశ్వర గుట్ట నుండి మల్లూరు మహారాజ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన పండరీపూర్ మహా పాదయాత్ర కార్యక్రమంలో కంగ్టి మండలానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు,జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్,భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు గుర్రపు మచ్చేందర్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుర్రపు మచ్చేందర్ భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొంటూ, ఆధ్యాత్మిక కార్యక్రమానికి తన వంతు సహకారం అందించారు. ఈ మహా పాదయాత్ర ద్వారా భక్తులలో భక్తి భావం మరింతగా పెరుగుతుందని,ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సద్భావనను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.పండరీపూర్ విఠలుని కృపతో ప్రజలందరికీ శాంతి,

సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.ఈ మహా పాదయాత్ర సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, విఠల నామస్మరణతో మార్గమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.భక్తి గీతాలు,జయఘోషలతో పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగింది.ఈ కార్యక్రమంలో అశోక్ మహారాజ్, మారుతి మహారాజ్, బీబీపేట మాజీ ఎంపిటిసి మహారెడ్డి నాగిరెడ్డి, కృష్ణాపూర్ మాజీ ఎంపిటిసి అంజయ్య సాగర్, దామర్గిద మాజీ సర్పంచ్ శంకర్ సాగర్, భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు మారపు సాయిలు, సురేందర్ రెడ్డి, నర్సింగ్ రావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News