Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:54 AM

ఫోటోగ్రాఫర్లకు రోజుకు ఒక రూపాయి భరోసా

ఫోటోగ్రాఫర్లకు రోజుకు ఒక రూపాయి భరోసా

ఫోటోగ్రాఫర్లకు రోజుకు ఒక రూపాయి భరోసా
27-01-2026 150 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్టలో ఆర్థిక భద్రతకు నాంది

స్థానికం ప్రధాన ప్రతినిధి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో యాదాద్రి భువనగిరి జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల ఆర్థిక భద్రత లక్ష్యంగా “రోజుకు ఒక రూపాయి” ఆర్థిక భరోసా పథకానికి సంబంధించిన పోస్టర్, బాండ్‌ను ఘనంగా ఆవిష్కరించారు.ఈ పథకం ద్వారా జిల్లాలోని ఫోటోగ్రాఫర్లకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, అనుకోని పరిస్థితుల్లో వారి కుటుంబాలకు కూడా భరోసా కల్పించాలన్నదే లక్ష్యమని సంఘ నాయకులు తెలిపారు. సభ్యుల ఐక్యత, పరస్పర సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భోగ చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్లా హరిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యమల అప్పలరెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు బొమ్మగాని గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు చాట్లపల్లి సిద్ధు, పందిరి రమేష్, జిల్లా పీఆర్‌వో భేతి రవికుమార్, రామన్నపేట ప్రచార కార్యదర్శి భాషమల్ల సంతోష్ కుమార్, యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రే శ్యామ్, ప్రధాన కార్యదర్శి కందోజు రవికిరణ్, భోగ శేఖర్, సంతోష్, స్వామి నాయక్‌తో పాటు మండల ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి ఈ ఆర్థిక భరోసా పథకం దిశానిర్దేశకంగా నిలుస్తుందని కార్యక్రమంలో పాల్గొన్నవారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Sthanikam

ఫోటోగ్రాఫర్లకు రోజుకు ఒక రూపాయి భరోసా

Article Image

యాదగిరిగుట్టలో ఆర్థిక భద్రతకు నాంది

స్థానికం ప్రధాన ప్రతినిధి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో యాదాద్రి భువనగిరి జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల ఆర్థిక భద్రత లక్ష్యంగా “రోజుకు ఒక రూపాయి” ఆర్థిక భరోసా పథకానికి సంబంధించిన పోస్టర్, బాండ్‌ను ఘనంగా ఆవిష్కరించారు.ఈ పథకం ద్వారా జిల్లాలోని ఫోటోగ్రాఫర్లకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, అనుకోని పరిస్థితుల్లో వారి కుటుంబాలకు కూడా భరోసా కల్పించాలన్నదే లక్ష్యమని సంఘ నాయకులు తెలిపారు. సభ్యుల ఐక్యత, పరస్పర సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భోగ చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్లా హరిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యమల అప్పలరెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు బొమ్మగాని గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు చాట్లపల్లి సిద్ధు, పందిరి రమేష్, జిల్లా పీఆర్‌వో భేతి రవికుమార్, రామన్నపేట ప్రచార కార్యదర్శి భాషమల్ల సంతోష్ కుమార్, యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రే శ్యామ్, ప్రధాన కార్యదర్శి కందోజు రవికిరణ్, భోగ శేఖర్, సంతోష్, స్వామి నాయక్‌తో పాటు మండల ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి ఈ ఆర్థిక భరోసా పథకం దిశానిర్దేశకంగా నిలుస్తుందని కార్యక్రమంలో పాల్గొన్నవారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News