Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెడ్ కానిస్టేబుల్ అంగోతు యాదగిరికి ఘన నివాళి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:42 PM

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె – గ్రామ పంచాయతీ కార్మికుల సమరభేరి

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె – గ్రామ పంచాయతీ కార్మికుల సమరభేరి

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె – గ్రామ పంచాయతీ కార్మికుల సమరభేరి
January 28, 2026 05:51 PM 184 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 12న ఒక్కరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగనుందని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నకరేకంటి రాము ప్రకటించారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ మేరకు మండల కేంద్రంలో ఎంపీడీవో ఆవుల రాములు, ఎంపీవో రావూఫ్ అలీకి సమ్మె నోటీసులు అందజేశారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులంతా సమ్మెలో పాల్గొని తమ హక్కుల సాధనకు ఐక్యంగా నిలవాలని ఆయన కోరారు.కార్మికులకు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలుగా నిర్ణయించాలని, 51 జీవోను రద్దు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బందిని శాశ్వతీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని, పదవీ విరమణ ప్రయోజనాలు, ఐదు లక్షల రూపాయల బీమా, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆన్లైన్‌లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేయాలని, మరణించిన కార్మికుల అంత్యక్రియలకు ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల బిక్షం, మండల అధ్యక్షులు గాదె ఎల్లయ్య, నాయకులు బొడ్డు సాలయ్య, గాదె చంద్రయ్య, కాడే యాదమ్మ, మొలకలపల్లి జయమ్మ, నకరేకంటి ప్రమీల, గాదె భారతమ్మ, నకరేకంటి కిష్టయ్య, గొర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News