Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:38 AM

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె – గ్రామ పంచాయతీ కార్మికుల సమరభేరి

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె – గ్రామ పంచాయతీ కార్మికుల సమరభేరి

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె – గ్రామ పంచాయతీ కార్మికుల సమరభేరి
January 28, 2026 05:51 PM 190 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 12న ఒక్కరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగనుందని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నకరేకంటి రాము ప్రకటించారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ మేరకు మండల కేంద్రంలో ఎంపీడీవో ఆవుల రాములు, ఎంపీవో రావూఫ్ అలీకి సమ్మె నోటీసులు అందజేశారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులంతా సమ్మెలో పాల్గొని తమ హక్కుల సాధనకు ఐక్యంగా నిలవాలని ఆయన కోరారు.కార్మికులకు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలుగా నిర్ణయించాలని, 51 జీవోను రద్దు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బందిని శాశ్వతీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని, పదవీ విరమణ ప్రయోజనాలు, ఐదు లక్షల రూపాయల బీమా, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆన్లైన్‌లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేయాలని, మరణించిన కార్మికుల అంత్యక్రియలకు ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల బిక్షం, మండల అధ్యక్షులు గాదె ఎల్లయ్య, నాయకులు బొడ్డు సాలయ్య, గాదె చంద్రయ్య, కాడే యాదమ్మ, మొలకలపల్లి జయమ్మ, నకరేకంటి ప్రమీల, గాదె భారతమ్మ, నకరేకంటి కిష్టయ్య, గొర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News