Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:41 PM

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె – గ్రామ పంచాయతీ కార్మికుల సమరభేరి

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె – గ్రామ పంచాయతీ కార్మికుల సమరభేరి

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె – గ్రామ పంచాయతీ కార్మికుల సమరభేరి
28-01-2026 200 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 12న ఒక్కరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగనుందని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నకరేకంటి రాము ప్రకటించారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ మేరకు మండల కేంద్రంలో ఎంపీడీవో ఆవుల రాములు, ఎంపీవో రావూఫ్ అలీకి సమ్మె నోటీసులు అందజేశారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులంతా సమ్మెలో పాల్గొని తమ హక్కుల సాధనకు ఐక్యంగా నిలవాలని ఆయన కోరారు.కార్మికులకు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలుగా నిర్ణయించాలని, 51 జీవోను రద్దు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బందిని శాశ్వతీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని, పదవీ విరమణ ప్రయోజనాలు, ఐదు లక్షల రూపాయల బీమా, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆన్లైన్‌లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేయాలని, మరణించిన కార్మికుల అంత్యక్రియలకు ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల బిక్షం, మండల అధ్యక్షులు గాదె ఎల్లయ్య, నాయకులు బొడ్డు సాలయ్య, గాదె చంద్రయ్య, కాడే యాదమ్మ, మొలకలపల్లి జయమ్మ, నకరేకంటి ప్రమీల, గాదె భారతమ్మ, నకరేకంటి కిష్టయ్య, గొర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె – గ్రామ పంచాయతీ కార్మికుల సమరభేరి

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 12న ఒక్కరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగనుందని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నకరేకంటి రాము ప్రకటించారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ మేరకు మండల కేంద్రంలో ఎంపీడీవో ఆవుల రాములు, ఎంపీవో రావూఫ్ అలీకి సమ్మె నోటీసులు అందజేశారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులంతా సమ్మెలో పాల్గొని తమ హక్కుల సాధనకు ఐక్యంగా నిలవాలని ఆయన కోరారు.కార్మికులకు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలుగా నిర్ణయించాలని, 51 జీవోను రద్దు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బందిని శాశ్వతీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని, పదవీ విరమణ ప్రయోజనాలు, ఐదు లక్షల రూపాయల బీమా, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆన్లైన్‌లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేయాలని, మరణించిన కార్మికుల అంత్యక్రియలకు ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల బిక్షం, మండల అధ్యక్షులు గాదె ఎల్లయ్య, నాయకులు బొడ్డు సాలయ్య, గాదె చంద్రయ్య, కాడే యాదమ్మ, మొలకలపల్లి జయమ్మ, నకరేకంటి ప్రమీల, గాదె భారతమ్మ, నకరేకంటి కిష్టయ్య, గొర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News