PRINT TIME: April 10, 2026 10:40 AM
ఫేక్ లింక్స్పై సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరిక – వాట్సాప్ మోసాలకు దూరంగా ఉండాలి
ఫేక్ లింక్స్పై సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరిక – వాట్సాప్ మోసాలకు దూరంగా ఉండాలి
January 16, 2026 10:04 AM
155 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి
రామన్నపేట సీఐ ఎన్. వెంకటేశ్వర్లు ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో “లింక్ షేర్ చేస్తే రూ.5 వేలు వస్తాయి” అంటూ వస్తున్న మెసేజ్లు పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేశారు. ఇటువంటి లింకులు ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వ్యక్తిగత సమాచారం వెళ్లిపోయే ప్రమాదం ఉందని, ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.
లింక్ క్లిక్ చేయడమే కాకుండా, ఎలాంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇలాంటి మెసేజ్లు షేర్ చేయవద్దని సూచించారు. ఫేక్ లింకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద మెసేజ్లు వస్తే వెంటనే తొలగించాలని తెలిపారు. సైబర్ మోసాల నుంచి రక్షణ పొందాలంటే జాగ్రత్తే ప్రధాన ఆయుధమని సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి