పేదవాడి సొంతింటి కల సాకారం: 13వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
పేదవాడి సొంతింటి కల సాకారం: 13వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
K.RAVI
పేదల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నామని 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం వార్డు పరిధిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కౌన్సిలర్ బత్తుల వాణి మాట్లాడుతూ.. వార్డులోని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు తెలిపారు."అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించి, వారు ఆత్మగౌరవంతో జీవించేలా చూడటమే మా లక్ష్యం. రాబోయే రోజుల్లో మరిన్ని ఇళ్ల నిర్మాణానికి మేము కట్టుబడి ఉన్నాం." అభివృద్ధి పథంలోవార్డును అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు ప్రజలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న కౌన్సిలర్ దంపతుల కృషిని స్థానికులు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి