Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:47 PM

పేదల సొంతింటి కల సాకారం చేసిన కాంగ్రెస్ ప్రజా పాలన

పేదల సొంతింటి కల సాకారం చేసిన కాంగ్రెస్ ప్రజా పాలన

పేదల సొంతింటి కల సాకారం చేసిన కాంగ్రెస్ ప్రజా పాలన
February 22, 2026 06:50 PM 237 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఇచ్చిన మాట నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ – రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట మండలంలోని కాసరబాద గ్రామంలో పేదల సొంతింటి కల నిజమైంది. దుండిగల రాములు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ పేదల మొహంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. పేదలకు సొంత ఇల్లు అందించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వమని తెలిపారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పి పదేళ్లు కాలం గడిపిందని, కానీ ఒక్కరికైనా పక్కా ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి పేదల ఆశలను నెరవేర్చిందని గుర్తుచేశారు. ప్రతి ఏడాది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్ల చొప్పున మంజూరు చేసి ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి అందిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారని, సర్పంచ్ మరియు మున్సిపల్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News