Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలేకు రామన్నపేట లో ఘన నివాళి సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:48 PM

పేదల సొంతింటి కల సాకారం చేసిన కాంగ్రెస్ ప్రజా పాలన

పేదల సొంతింటి కల సాకారం చేసిన కాంగ్రెస్ ప్రజా పాలన

పేదల సొంతింటి కల సాకారం చేసిన కాంగ్రెస్ ప్రజా పాలన
February 22, 2026 06:50 PM 231 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఇచ్చిన మాట నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ – రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట మండలంలోని కాసరబాద గ్రామంలో పేదల సొంతింటి కల నిజమైంది. దుండిగల రాములు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ పేదల మొహంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. పేదలకు సొంత ఇల్లు అందించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వమని తెలిపారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పి పదేళ్లు కాలం గడిపిందని, కానీ ఒక్కరికైనా పక్కా ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి పేదల ఆశలను నెరవేర్చిందని గుర్తుచేశారు. ప్రతి ఏడాది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్ల చొప్పున మంజూరు చేసి ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి అందిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారని, సర్పంచ్ మరియు మున్సిపల్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News