Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:33 AM

పేద ముస్లిం మహిళకు గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ చేయూత...

పేద ముస్లిం మహిళకు గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ చేయూత...

పేద ముస్లిం మహిళకు గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ చేయూత...
21-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-రంజాన్ సందర్భంగా కొత్త ఇంటి గృహప్రవేశం

భువనగిరి మండల పరిధిలోని తాజ్‌పూర్ గ్రామానికి చెందిన పేద,ఒంటరి ముస్లిం మహిళ షేక్ అమీనా బి నివాసం లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆమెకు చేయూతనందించారు. తమ ఆర్.ఎస్.కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో,సామాజిక వేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ నేతృత్వంలో స్వంత ఖర్చుతో ఆమెకు కొత్త ఇంటిని నిర్మించి అందజేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం ఆ ఇంటిలో గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ మాట్లాడుతూ,గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయని,గ్రామ ప్రజల శ్రేయస్సే తన ప్రధాన లక్ష్యమని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త డా.ర్యాకల శ్రీనివాస్,ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ,వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ,మహ్మద్ గాలిబీ యాకుబ్,బొమ్మారపు రామకృష్ణ,బొమ్మారపు లక్ష్మి బాలరాజ్,బీట్కూరి మహేష్,ఓరుగంటి మానస నాగరాజు,స్థానిక వార్డు సభ్యులు షేక్ అహ్మద్,గ్రామ పెద్దలు,యువకులు,మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేద ముస్లిం మహిళకు గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ చేయూత...

Article Image

-రంజాన్ సందర్భంగా కొత్త ఇంటి గృహప్రవేశం

భువనగిరి మండల పరిధిలోని తాజ్‌పూర్ గ్రామానికి చెందిన పేద,ఒంటరి ముస్లిం మహిళ షేక్ అమీనా బి నివాసం లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆమెకు చేయూతనందించారు. తమ ఆర్.ఎస్.కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో,సామాజిక వేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ నేతృత్వంలో స్వంత ఖర్చుతో ఆమెకు కొత్త ఇంటిని నిర్మించి అందజేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం ఆ ఇంటిలో గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ మాట్లాడుతూ,గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయని,గ్రామ ప్రజల శ్రేయస్సే తన ప్రధాన లక్ష్యమని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త డా.ర్యాకల శ్రీనివాస్,ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ,వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ,మహ్మద్ గాలిబీ యాకుబ్,బొమ్మారపు రామకృష్ణ,బొమ్మారపు లక్ష్మి బాలరాజ్,బీట్కూరి మహేష్,ఓరుగంటి మానస నాగరాజు,స్థానిక వార్డు సభ్యులు షేక్ అహ్మద్,గ్రామ పెద్దలు,యువకులు,మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News