చిట్యాల: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు (శివనేనిగూడెం) కౌన్సిలర్ నాగిళ్ళ సుధాకర్ (ట్రాన్స్జెండర్) తన ఉదారతను చాటుకున్నారు. వార్డులోని పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేస్తానన్న మాట ప్రకారం గ్రామానికి చెందిన శివరాజ్ నిలమ్మ కుమార్తె వివాహానికి రూ. 10,116 నగదు సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించిన సుధాకర్, ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పేద కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ను స్థానిక నాయకులు, గ్రామస్తులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లేబోయిన మల్లేష్ యాదవ్, మైల స్వామి, గోకుల నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి