Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:11 AM

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు: షేక్ చాంద్

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు: షేక్ చాంద్

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు: షేక్ చాంద్
07-01-2026 310 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట పట్టణ కేంద్రంలో జనవరి 7, 2026న గరిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఆర్‌పిఎల్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్న ఆర్‌బీఎల్ సెవెన్ హిల్స్ క్రికెట్ జట్టు సభ్యులకు బుధవారం టీషర్టులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు, తెలంగాణ ఉద్యమ నేత షేక్ చాంద్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా షేక్ చాంద్ మాట్లాడుతూ పట్టుదలతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చని అన్నారు. యువత చెడు మార్గాలను అనుసరించకుండా క్రీడల వైపు మొగ్గు చూపాలని సూచించారు. క్రీడల్లో రాణించేలా దాతలు ముందుకు వచ్చి యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి టోర్నమెంట్లు యువతలో క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిర్రు వెంకట్, పాండు, ఎండి ఆరిఫ్, నిక్కి, శ్రీశైలం, బత్తుల శివ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు: షేక్ చాంద్

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట పట్టణ కేంద్రంలో జనవరి 7, 2026న గరిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఆర్‌పిఎల్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్న ఆర్‌బీఎల్ సెవెన్ హిల్స్ క్రికెట్ జట్టు సభ్యులకు బుధవారం టీషర్టులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు, తెలంగాణ ఉద్యమ నేత షేక్ చాంద్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా షేక్ చాంద్ మాట్లాడుతూ పట్టుదలతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చని అన్నారు. యువత చెడు మార్గాలను అనుసరించకుండా క్రీడల వైపు మొగ్గు చూపాలని సూచించారు. క్రీడల్లో రాణించేలా దాతలు ముందుకు వచ్చి యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి టోర్నమెంట్లు యువతలో క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిర్రు వెంకట్, పాండు, ఎండి ఆరిఫ్, నిక్కి, శ్రీశైలం, బత్తుల శివ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News