Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:34 PM

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు: షేక్ చాంద్

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు: షేక్ చాంద్

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు: షేక్ చాంద్
January 07, 2026 06:41 PM 282 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట పట్టణ కేంద్రంలో జనవరి 7, 2026న గరిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఆర్‌పిఎల్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్న ఆర్‌బీఎల్ సెవెన్ హిల్స్ క్రికెట్ జట్టు సభ్యులకు బుధవారం టీషర్టులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు, తెలంగాణ ఉద్యమ నేత షేక్ చాంద్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా షేక్ చాంద్ మాట్లాడుతూ పట్టుదలతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చని అన్నారు. యువత చెడు మార్గాలను అనుసరించకుండా క్రీడల వైపు మొగ్గు చూపాలని సూచించారు. క్రీడల్లో రాణించేలా దాతలు ముందుకు వచ్చి యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి టోర్నమెంట్లు యువతలో క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిర్రు వెంకట్, పాండు, ఎండి ఆరిఫ్, నిక్కి, శ్రీశైలం, బత్తుల శివ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News