పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు: షేక్ చాంద్
పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు: షేక్ చాంద్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట పట్టణ కేంద్రంలో జనవరి 7, 2026న గరిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఆర్పిఎల్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న ఆర్బీఎల్ సెవెన్ హిల్స్ క్రికెట్ జట్టు సభ్యులకు బుధవారం టీషర్టులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు, తెలంగాణ ఉద్యమ నేత షేక్ చాంద్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా షేక్ చాంద్ మాట్లాడుతూ పట్టుదలతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చని అన్నారు. యువత చెడు మార్గాలను అనుసరించకుండా క్రీడల వైపు మొగ్గు చూపాలని సూచించారు. క్రీడల్లో రాణించేలా దాతలు ముందుకు వచ్చి యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి టోర్నమెంట్లు యువతలో క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిర్రు వెంకట్, పాండు, ఎండి ఆరిఫ్, నిక్కి, శ్రీశైలం, బత్తుల శివ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి