Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:09 PM

పారిశుధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టిన వార్డు సభ్యుడు ముత్యాల కిషన్

పారిశుధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టిన వార్డు సభ్యుడు ముత్యాల కిషన్

పారిశుధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టిన వార్డు సభ్యుడు ముత్యాల కిషన్
January 19, 2026 06:21 PM 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి: కొండ మల్లేశం గౌడ్

పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా జీవించగలమని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యత వహించాలని నీర్నెముల గ్రామ 6వ వార్డు సభ్యుడు ముత్యాల కిషన్ అన్నారు. సోమవారం 6వ వార్డులో పారిశుధ్య కార్మికులతో కలిసి ఆయన స్వయంగా చీపురు పట్టి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు.

ఈ సందర్భంగా ముత్యాల కిషన్ మాట్లాడుతూ, మన ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుని బాధ్యత అని అన్నారు. చెత్తను కాలువల్లో, రోడ్ల పక్కన వేయకుండా పారిశుధ్య కార్మికులు ఇంటివద్దకు వచ్చినప్పుడే అప్పగించాలని సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యాధుల నివారణకు కూడా దోహదపడుతుందని తెలిపారు.తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా వర్గీకరించి ఇవ్వాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించే సమయంలో కార్మికులు తప్పనిసరిగా గ్లౌజులు, మాస్కులు ధరించాలని సూచించారు. పారిశుధ్య కార్మికులు ప్రతినెల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, పోషకాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని వారికి సూచించారు.వార్డు సభ్యుడు పారిశుధ్య కార్మికులతో కలిసి స్వయంగా శుభ్రత కార్యక్రమంలో పాల్గొనడం గ్రామస్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ముత్యాల కిషన్‌ను అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News