Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:15 AM

పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి: కొండూరి వెంకటేష్

పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి: కొండూరి వెంకటేష్

పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి: కొండూరి వెంకటేష్
17-03-2026 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

స్థానిక యువతకు ఉపాధి కల్పించకపోతే ఆందోళనలు తీవ్రం

చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్ డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా స్థానికులు ఉద్యోగాల కోసం పోరాటాలు చేస్తున్నప్పటికీ పరిశ్రమలు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, తమ ప్రాంతంలోనే పరిశ్రమలు ఉన్నప్పటికీ బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ ప్రాంతంలోని పంట పొలాలు, బూగర్భ జలాలు పరిశ్రమల వల్ల తీవ్రంగా కలుషితం అవుతున్నాయని ఆరోపించారు. రసాయన పరిశ్రమలు వ్యర్థాలను యథేచ్ఛగా పారబోస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పర్యావరణాన్ని నాశనం చేస్తే ప్రజలు ఊరుకోరని, భవిష్యత్తులో తీవ్ర ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో బద్దుల సుధాకర్, దాసరి మనోహర్, గుండెబోయిన భాస్కర్, ఉడుత రాజు, దాసరి సిద్దు, రాంచరణ్, సాయితేజ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి: కొండూరి వెంకటేష్

Article Image

స్థానిక యువతకు ఉపాధి కల్పించకపోతే ఆందోళనలు తీవ్రం

చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్ డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా స్థానికులు ఉద్యోగాల కోసం పోరాటాలు చేస్తున్నప్పటికీ పరిశ్రమలు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, తమ ప్రాంతంలోనే పరిశ్రమలు ఉన్నప్పటికీ బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ ప్రాంతంలోని పంట పొలాలు, బూగర్భ జలాలు పరిశ్రమల వల్ల తీవ్రంగా కలుషితం అవుతున్నాయని ఆరోపించారు. రసాయన పరిశ్రమలు వ్యర్థాలను యథేచ్ఛగా పారబోస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పర్యావరణాన్ని నాశనం చేస్తే ప్రజలు ఊరుకోరని, భవిష్యత్తులో తీవ్ర ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో బద్దుల సుధాకర్, దాసరి మనోహర్, గుండెబోయిన భాస్కర్, ఉడుత రాజు, దాసరి సిద్దు, రాంచరణ్, సాయితేజ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News