Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:07 PM

పరిసరాల పరిశుభ్రతకు గ్రామస్తుల భాగస్వామ్యం తప్పనిసరి : సర్పంచ్ వెంకటేశం

పరిసరాల పరిశుభ్రతకు గ్రామస్తుల భాగస్వామ్యం తప్పనిసరి : సర్పంచ్ వెంకటేశం

పరిసరాల పరిశుభ్రతకు గ్రామస్తుల భాగస్వామ్యం తప్పనిసరి : సర్పంచ్ వెంకటేశం
January 20, 2026 05:57 PM 136 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మునిపంపుల, స్థానికం ప్రధాన ప్రతినిధి

గ్రామ పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవడంలో గ్రామ ప్రజలందరూ బాధ్యతాయుతంగా భాగస్వామ్యం కావాలని మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం పిలుపునిచ్చారు. స్వచ్ఛ గ్రామ లక్ష్యంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన శుభ్రత కార్యక్రమంలో భాగంగా ఒకటవ వార్డులో పేరుకుపోయిన కంప చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించి, మూసుకుపోయిన రహదారులను జేసీబీ సహాయంతో శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశం మాట్లాడుతూ, గ్రామంలో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి గ్రామపంచాయతీ చెత్త ట్రాక్టర్‌లోనే వేయాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో పేరుకుపోయిన పెంట దిబ్బలు, పిచ్చి మొక్కలను తొలగించుకోవాలని, పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన జీవనానికి పునాదని తెలిపారు.

ప్రధాన వీధులు, ప్రజా ప్రదేశాల శుభ్రతకు గ్రామపంచాయతీ నిరంతరం చర్యలు తీసుకుంటోందని, గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అత్యవసరమన్నారు. పరిసరాల పరిశుభ్రతలో గ్రామ ప్రజలందరూ భాగస్వామ్యం అయినప్పుడే గ్రామం ఆరోగ్యకరంగా, ఆదర్శ గ్రామంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. గత పది రోజులుగా మూసుకుపోయిన ప్రధాన వీధులను శుభ్రం చేస్తూ నిరంతర పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.గ్రామంలో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టినందుకు గ్రామ ప్రజలు సర్పంచ్ వెంకటేశానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ తాళ్ళ క్రాంతి కుమార్, వార్డు సభ్యులు యాదాసు మంగమ్మ నర్సింహ, యాదాసు లక్ష్మణ్, గ్రామస్తులు ఎండీ మైనొద్దీన్, కూనూరు లింగస్వామి, సప్పిడి భగవంత్ రెడ్డి, నోముల నర్సిరెడ్డి, ఎండీ బద్రోద్దీన్, శానగొండ శ్రీధర్, ఉయ్యాల స్టాలిన్, గ్రామపంచాయతీ సిబ్బంది బూడిద మారయ్య, కనుకుంట్ల భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News