ప్రతిభ విద్యాలయం 2008-09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ
ప్రతిభ విద్యాలయం 2008-09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని షేట్కార్ ఫార్మ్స్లో ప్రతిభ విద్యాలయం 2008-09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివకుమార్, వినయ్ కుమార్, సతీష్, శ్రీనివాస్ రెడ్డి, దశరథ్,లు పాల్గొని విద్యార్థులతో కలిసి పాత అనుభవాలను పంచుకుంటూ వారికి అభినందనలు తెలిపారు. పూర్వ విద్యార్థులు తరగతి గది జ్ఞాపకాలు, స్నేహబంధాలు, పాఠశాల రోజుల సరదా సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనం పాత స్నేహాలను మరింత బలపరచడమే కాకుండా అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపిందని పాల్గొన్న వారు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ స్నేహబంధాలను కొనసాగించాలని పూర్వ విద్యార్థులు ఆకాంక్షించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి