Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:20 PM

ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ బహుకరణ. మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి

ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ బహుకరణ. మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి

ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ బహుకరణ. మాజీ సర్పంచ్ ఎడ్ల  మహేందర్ రెడ్డి
January 27, 2026 05:56 AM 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డిజిటల్ బోధనతో భవిష్యత్‌కు బాటలు..!

రామన్నపేట, స్థానిక ప్రధాన ప్రతినిధి

విద్యార్థులకు డిజిటల్ విద్యను అందిస్తే పోటీ ప్రపంచంలో ముందంజలో నిలవగలరని వెల్లంకి గ్రామ మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ బోధన కోసం స్మార్ట్ టీవీని ఏర్పాటు చేశారు.గ్రామ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎడ్ల నరేందర్ రెడ్డి తన సొంత నిధులతో రూ.30 వేల వ్యయంతో స్మార్ట్ టీవీని సమకూర్చగా, బీఆర్ఎస్ జిల్లా నాయకులు, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి చేతులమీదుగా పాఠశాలకు బహుకరించారు.ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ విద్య ద్వారా విద్యార్థులకు ఆడియో–విజువల్ లెర్నింగ్ సదుపాయాలు లభిస్తాయని, జాతీయ స్థాయి పాఠ్యాంశాలను సులభంగా అవగాహన చేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇది విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, మేధోశక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, ఉప సర్పంచ్ మిరియాల రాజ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు పళ్ళే మోహన్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News