ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ బహుకరణ. మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి
ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ బహుకరణ. మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి
స్థానికం బృందం
డిజిటల్ బోధనతో భవిష్యత్కు బాటలు..!
రామన్నపేట, స్థానిక ప్రధాన ప్రతినిధి
విద్యార్థులకు డిజిటల్ విద్యను అందిస్తే పోటీ ప్రపంచంలో ముందంజలో నిలవగలరని వెల్లంకి గ్రామ మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ బోధన కోసం స్మార్ట్ టీవీని ఏర్పాటు చేశారు.గ్రామ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎడ్ల నరేందర్ రెడ్డి తన సొంత నిధులతో రూ.30 వేల వ్యయంతో స్మార్ట్ టీవీని సమకూర్చగా, బీఆర్ఎస్ జిల్లా నాయకులు, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి చేతులమీదుగా పాఠశాలకు బహుకరించారు.ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ విద్య ద్వారా విద్యార్థులకు ఆడియో–విజువల్ లెర్నింగ్ సదుపాయాలు లభిస్తాయని, జాతీయ స్థాయి పాఠ్యాంశాలను సులభంగా అవగాహన చేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇది విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, మేధోశక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, ఉప సర్పంచ్ మిరియాల రాజ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు పళ్ళే మోహన్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి