Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 10:34 AM

ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ బహుకరణ. మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి

ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ బహుకరణ. మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి

ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ బహుకరణ. మాజీ సర్పంచ్ ఎడ్ల  మహేందర్ రెడ్డి
January 27, 2026 05:56 AM 113 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డిజిటల్ బోధనతో భవిష్యత్‌కు బాటలు..!

రామన్నపేట, స్థానిక ప్రధాన ప్రతినిధి

విద్యార్థులకు డిజిటల్ విద్యను అందిస్తే పోటీ ప్రపంచంలో ముందంజలో నిలవగలరని వెల్లంకి గ్రామ మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ బోధన కోసం స్మార్ట్ టీవీని ఏర్పాటు చేశారు.గ్రామ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎడ్ల నరేందర్ రెడ్డి తన సొంత నిధులతో రూ.30 వేల వ్యయంతో స్మార్ట్ టీవీని సమకూర్చగా, బీఆర్ఎస్ జిల్లా నాయకులు, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి చేతులమీదుగా పాఠశాలకు బహుకరించారు.ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ విద్య ద్వారా విద్యార్థులకు ఆడియో–విజువల్ లెర్నింగ్ సదుపాయాలు లభిస్తాయని, జాతీయ స్థాయి పాఠ్యాంశాలను సులభంగా అవగాహన చేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇది విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, మేధోశక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, ఉప సర్పంచ్ మిరియాల రాజ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు పళ్ళే మోహన్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News