రామన్నపేట మండల వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ పరీక్షలు విద్యార్థుల జీవితంలో తొలి బోర్డు పరీక్షలు కావడంతో వారు ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో పాల్గొన్నారు.
పరీక్షలు ముగియడంతో తమ పదవ తరగతి విద్యార్థి జీవితానికి ముగింపు పలుకుతూ, మిత్రుల చిరునామాలు తీసుకుంటూ భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. తమ తమ పాఠశాలలకు వెళ్లి గురువులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
చివరి రోజు ఒకరినొకరు చూసుకుంటూ “మిత్రమా… మళ్లీ ఎప్పుడు కలుద్దాం?” అనే మాటలతో కాసింత ఆనందం, కాసింత బాధతో విడిపోయారు. పాఠశాల జీవితం నేటితో ముగిసిందనే భావనతో, భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి ఒకరికి ఒకరు తోడుగా నిలబడతామని ప్రతిజ్ఞ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి