ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు
Komidala Mahender reddy
నార్కెట్పల్లి:
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నార్కెట్పల్లి మండలంలోని కామినేని హాస్పిటల్లో క్యాన్సర్ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు పాల్గొని క్యాన్సర్ వ్యాధి కారణాలు, లక్షణాలు, ముందస్తు జాగ్రత్తలు, జీవనశైలిలో మార్పుల ద్వారా క్యాన్సర్ను ఎలా నివారించవచ్చో ప్రజలకు వివరించారు.ప్రారంభ దశలో గుర్తిస్తే క్యాన్సర్ను పూర్తిగా నియంత్రించవచ్చని వైద్యులు తెలిపారు. పొగతాగడం, మద్యం సేవించడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్యాన్సర్కు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాపాయాన్ని తగ్గించవచ్చని సూచించారు.అనంతరం నార్కెట్పల్లి పట్టణంలో మెడికల్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ నివారణపై నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారు. ర్యాలీకి పట్టణ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో కామినేని హాస్పిటల్ వైద్యులు, మెడికల్ విద్యార్థులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి