Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:30 AM

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా లాయోల టెక్నో స్కూల్‌లో మాక్ కోర్ట్

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా లాయోల టెక్నో స్కూల్‌లో మాక్ కోర్ట్

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా లాయోల టెక్నో స్కూల్‌లో మాక్ కోర్ట్
February 20, 2026 07:23 PM 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

విద్యార్థుల్లో న్యాయస్థాన విధానాలపై అవగాహన పెంపొందించేందుకు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని లాయోల టెక్నో స్కూల్‌లో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం విశిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన “మాక్ కోర్ట్” కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పాఠశాల ప్రాంగణంలో తాత్కాలిక కోర్టు వాతావరణాన్ని ప్రతిబింబించేలా వేదికను సిద్ధం చేసి, కోర్టు వ్యవహార శైలిని విద్యార్థులకు అనుభవపూర్వకంగా చూపించారు. విద్యార్థులు న్యాయమూర్తులు, న్యాయవాదుల వేషధారణలో పాల్గొని, ఒక కేసుకు సంబంధించి వాదనలు, ప్రతివాదనలు ఎలా జరుగుతాయో సమగ్రంగా ప్రదర్శించారు. తీర్పు వెలువరించే విధానం వరకు న్యాయస్థాన ప్రక్రియను ఆవిష్కరించడం ద్వారా హాజరైన వారిలో ఆసక్తి రేకెత్తించారు.

విద్యార్థుల అభినయం, వేదిక నిర్వహణ, న్యాయపరమైన అంశాలపై వారి అవగాహన అతిథులను, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, కౌన్సిలర్ సత్యనారాయణ, స్థానిక ఎస్‌.ఐ. రవి కుమార్ హాజరై విద్యార్థుల ప్రదర్శనను అభినందించారు. సమాజంలో న్యాయం, సమానత్వం విలువలను చిన్ననాటినుంచేఅలవరుచుకోవాల్సిన అవసరాన్ని వారు ప్రస్తావించారు.పాఠశాల ఛైర్మన్ ఎం.ఎఫ్. సుందర్ రాజు, ప్రిన్సిపాల్ ఎండి. జమీరుద్దీన్, డైరెక్టర్లు తీగల కిరణ్ కుమార్, మోర్తాల వెంకన్న, బెల్లం శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమంజరిగింది.ఉపాధ్యాయులు మధు, జానకి, లక్ష్మి, ఉష, సలీమా సహకారంతో విద్యార్థులు సమర్థంగానిర్వహించారు.విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News