పరాకాష్టకు చంద్రబాబు దుర్మార్గ పాలన - వంగర ఎంపీపీ, జిల్లా అధికార ప్రతినిధి యూ.సురేష్ ముఖర్జీ.
పరాకాష్టకు చంద్రబాబు దుర్మార్గ పాలన - వంగర ఎంపీపీ, జిల్లా అధికార ప్రతినిధి యూ.సురేష్ ముఖర్జీ.
Sr.Journalist YVN
అంబటి రాంబాబుపై హత్యాయత్నం, జోగి రమేష్ ఇంటిపై నిప్పు పెట్టడం .తక్షణం కేంద్రం, గరవ్నర్ జోక్యం చేసుకోవాలి,
ఆంధ్రప్రదేశ్లో గాడితప్పిన లా అండ్ ఆర్డర్,
లడ్డూ విషయంలో వాస్తవాలు బహిర్గతమవడంతో ఫ్రస్టేషన్లో చంద్రబాబు,
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎంతవరకైనా వెళ్తాం,
వైసీపీ విజయనగరం జిల్లా అధికార ప్రతినిధి, ఎంపీపీ యూ.సురేష్ ముఖర్జీ, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరణం సుదర్శన్ రావు స్పష్టీకరణ.
రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలన పరాకాష్టకు చేరిందని వైసీపీ విజయనగరం జిల్లా అధికార ప్రతినిధి, ఎంపీపీ యూ.సురేష్ ముఖర్జీ, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరణం సుదర్శన్ రావు మండిపడ్డారు. సోమవారం వంగర మండల కేంద్రంలో పత్రికా ముఖంగా మాట్లాడుతూ ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గుండాలు హత్యాయత్నం చేయడాన్ని వీరు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు తావు ఇవ్వకూడదన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందువుల విశ్వాసాలను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం హోదాలో చంద్రబాబే దుష్ప్రచారం చేశారన్నారు. తాజాగా సీబీఐ సిట్ నివేదికలో జంతువుల కొవ్వు లేదని వెల్లడైందన్నారు. నిజాలు బయటకు రావడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి నాయకులు ఫ్రస్టేషన్లోకి వెళ్లిపోయారని తెలిపారు. పైగా వాస్తవాలను పక్కదోవ పట్టిస్తూ ఫ్లెక్సీలు వేసి మరోసారి అసత్య ప్రచారాలకు దిగారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కించపరిచేలా పోస్టర్లు వేయించారని మండిపడ్డారు. ఫ్లెక్సీలను తొలగించడానికి వెళితే పోలీసుల ముందే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేశారని తెలిపారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని,పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు.ఇటీవల హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై కూడా టీడీపీ గూండాలు దాడి చేశారని, మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని, బీసీ నేత జోగి రమేష్ పై కూడా దాడికి పాల్పడ్డారని గుర్తు చేశారు. తిరుమల లడ్డూ విషయంలో ఫిర్యాదు చేయడాని వెళితే మాజీ హోంమంత్రి సుచరితను కూడా పోలీస్ కార్యాలయంలోకి అనుమతించలేదని చెప్పారు. రాష్ట్ర డీజీపీ బంట్రోతుగా మారిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై తక్షణం కేంద్రం స్పందించాలని, గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామని.. దౌర్జన్యాలకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. కూటమి కార్యకర్తలను చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కంట్రోల్లో పెట్టుకోవాలని సూచించారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా టీచర్స్ వింగ్ అధ్యక్షులు మరిసర్ల గంగారావు, వంగర మండల యూత్ వింగ్ అధ్యక్షులు బొక్కెల వెంకటప్పలనాయుడు, మడ్డువలస సర్పంచ్ ప్రతినిధి బురాడ వెంకట రావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి