Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:06 PM

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
January 19, 2026 06:12 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పెండింగ్‌కు వెళ్లకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల (రెవెన్యూ) అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 29 అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత కాలంలో పరిష్కరించాలని సూచించారు. ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు.ప్రజావాణిలో వచ్చిన అర్జీలలో రెవెన్యూ శాఖకు 20, పంచాయతీ శాఖకు 3, గ్రామీణాభివృద్ధి శాఖకు 2, ఎస్సీ వెల్ఫేర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మున్సిపాలిటీ, లేబర్ శాఖలకు ఒక్కో దరఖాస్తు చొప్పున వచ్చినట్లు అధికారులు వివరించారు.

వివిధ శాఖలకు సంబంధించిన అర్జీలను వెంటనే పరిశీలించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, ఆర్డీవో కృష్ణారెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News