Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:54 AM

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
January 19, 2026 06:12 PM 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పెండింగ్‌కు వెళ్లకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల (రెవెన్యూ) అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 29 అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత కాలంలో పరిష్కరించాలని సూచించారు. ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు.ప్రజావాణిలో వచ్చిన అర్జీలలో రెవెన్యూ శాఖకు 20, పంచాయతీ శాఖకు 3, గ్రామీణాభివృద్ధి శాఖకు 2, ఎస్సీ వెల్ఫేర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మున్సిపాలిటీ, లేబర్ శాఖలకు ఒక్కో దరఖాస్తు చొప్పున వచ్చినట్లు అధికారులు వివరించారు.

వివిధ శాఖలకు సంబంధించిన అర్జీలను వెంటనే పరిశీలించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, ఆర్డీవో కృష్ణారెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News